Shocking: ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా మహిళ.. డాక్టర్లు వద్దకు తీసుకెళ్లి స్కానింగ్.. రిపోర్ట్ చూసి మైండ్ బ్లాంక్

మన దేశంలో 800 మిలియన్ల జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసువారే. వారే భారత్‌కు ఆస్తి. ఈ క్రమంలోనే యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి.

Shocking: ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా మహిళ.. డాక్టర్లు వద్దకు తీసుకెళ్లి స్కానింగ్.. రిపోర్ట్ చూసి మైండ్ బ్లాంక్
Jaipur Airport
Follow us

|

Updated on: Mar 04, 2022 | 4:20 PM

Heroin in Women Body: డ్రగ్స్ రవాణా ఆగడం లేదు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఇండియాకు చేరుతున్నాయి. డ్రగ్స్‌ను మన దేశానికి తరలించేందుకు స్మగ్లర్స్ చేస్తున్న ప్రయత్నాలు పోలీసులను, అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇండియా.. డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ దేశంలోనూ లేనంత యువత మన దేశంలో ఉన్నారు. మన దేశంలో 800 మిలియన్ల జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసువారే. వారే భారత్‌కు ఆస్తి. ఈ క్రమంలోనే యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద మరింత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా శరీరంలో క్యాప్సుల్స్​ రూపంలో హెరాయిన్​ను తరలించేందుకు యత్నించిన ఓ మహిళను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.6 కోట్లు విలువ చేసే 862 గ్రాముల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్​లోని జైపుర్​ ఎయిర్‌పోర్ట్‌లో గతనెల 19న జరిగింది. సూడాన్​కు చెందిన ఈ నిందితురాలి నుంచి హెరాయిన్​ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు 12 రోజులు పట్టింది. ఎందుకంటే ఆమె శరీరంలో మొత్తం 88 క్యాప్సుల్స్​ దాచుకుని ఇక్కడకు వచ్చింది.

నిందితురాలికి స్కానింగ్​ నిర్వహించగా.. వచ్చిన రిపోర్ట్ చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.  కొన్ని క్సాప్సుల్స్​ ఆమె కడుపులో మరికొన్ని ఆమె ప్రైవేట్​ పార్ట్స్​లో దాచినట్లు గుర్తించారు. మేజిస్ట్రేట్​ నుంచి అనుమతులు వచ్చిన అనంతరం..   ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య డాక్టర్లు వీటిని వెలికి తీశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన అనంతరం బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి నిందితురాలుకు 14 రోజుల రిమాండ్​ విధించారు.

Heroin

Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..