AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్ఖండ్‌లో వెలుగుచూసిన దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సహా ఐదుగురిని నరికి చంపిన దుండగులు..!

జార్ఖండ్‌ రాష్ట్రంలోదారుణం జరిగింది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు.

జార్ఖండ్‌లో వెలుగుచూసిన దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సహా ఐదుగురిని నరికి చంపిన దుండగులు..!
Balaraju Goud
|

Updated on: Feb 24, 2021 | 12:40 PM

Share

family brutally killed : జార్ఖండ్‌ రాష్ట్రంలోదారుణం జరిగింది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. గుమ్లా జిల్లాలోని కామ్‌దరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు, ఓ చిన్నారిని పదునైన ఆయుధంతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఈ ఘోరం వెలుగుచూసింది. స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పహర్తోలి గ్రామానికి చెందిన నికుదీన్ తోప్నో (60) కుటుంబం నివాసముంటోంది. బుధవారం ఉదయం నికుదీన్ కుటుంబసభ్యుులు ఎవరు బయటకు రాకపోవడంతో.. ఇరుగుపొరుగు వారు వారి ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఐదుగురు కుటుంబసభ్యులు రక్తపుమడుగులో విగతజీవులై పడి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు నికుదీన్ తోప్నో (60), భార్య జోస్పినా (55), వారి కుమారుడు విన్సెంట్ (35), కోడలు సైల్వంతీ (30), వీరి ఐదేళ్ల కుమారుడు అశ్విన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, కుటుంబం వివాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, గత కొంతకాలంగా నికుదీన్ కుటుంబం ఆర్ధికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. డాగ్ స్వ్యాడ్‌ను రంగంలోకి దింపి, ఘటనా స్థలిలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇంటిలో మృతదేహాలు ఒక్కో చోట పడి ఉండటంతో హత్యగానే భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. వీరి శరీరాలపై ఉన్న గాయాలను బట్టి గొడ్డలితో దాడిచేసిన చంపిపట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

Read Also…  అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై