AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరంలో కాల్పుల కలకలం.. ఏటీఎం వాహన సిబ్బందిపై ఫైర్.. గాయాలు..

Kukatpally: భాగ్యనగరంలో కాల్పులు కలకలం రేపింది. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ప‌టేల్‌కుంట పార్కు వ‌ద్ద గురువారం మ‌ధ్యాహ్నం

Hyderabad: భాగ్యనగరంలో కాల్పుల కలకలం.. ఏటీఎం వాహన సిబ్బందిపై ఫైర్.. గాయాలు..
Gun Fire
Shaik Madar Saheb
|

Updated on: Apr 29, 2021 | 2:52 PM

Share

Kukatpally: భాగ్యనగరంలో కాల్పులు కలకలం రేపింది. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ప‌టేల్‌కుంట పార్కు వ‌ద్ద గురువారం మ‌ధ్యాహ్నం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. పార్కు దగ్గర ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండ‌గా ఈ ఘటన చోటుచేసుకుంది. యథావిధిగా సిబ్బంది వాహనంలో వచ్చి మధ్యాహ్నం వేళ హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో నగదును నింపుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు.. ఆ సిబ్బందిపై కాల్పులు జ‌రిపారు. అనంత‌రం డ‌బ్బును అప‌హ‌రించి అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బందికి తీవ్ర గాయాల‌య్యాయి.

సమాచారం మేరకు వెంటనే.. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు పలు వివరాలను సేకరించారు. గాయ‌ప‌డిన భ‌ద్ర‌తా సిబ్బందిని చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆసుపత్రికి త‌ర‌లించారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గుల కోసం పోలీసులు నగరంలో గాలిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

కాగా.. ఒక్క‌సారిగా కాల్పుల శ‌బ్దం వినిపించ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. నగరంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. వేగంగా వేయి పరుగులు..! రంగంలోకి దిగాడంటే ప్రత్యర్థులకు వణుకే.. ఎవరో తెలుసా..?

TS High Court: ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర హైకోర్టు అసహానం… ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని సూటి ప్రశ్న..!