Fire accident: పాల్వంచ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. రంగంలోకి ఫైర్ ఫైటర్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.

Fire accident: పాల్వంచ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. రంగంలోకి ఫైర్ ఫైటర్స్
Fir Accident
Follow us

|

Updated on: Jun 15, 2021 | 8:46 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు చెలగేగుతుండటంతో విద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపివేశారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు సబ్‌ స్టేషన్‌ మొత్తం విస్తరించడంతో ఇప్పటికే సబ్ స్టేషన్ సగానికిపైగా అగ్నికి ఆహుతైంది.  పాల్వంచ కేటీపీఎస్ నుంచి 3 కొత్తగూడెం నుంచి 1 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బంది సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. గత సంవత్సరం ఇదే సబ్ స్టేషన్ విద్యుత్ కేబుల్స్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Papikondalu Tourism: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పాపికొండల పర్యటనకు బోటు సర్వీసులు..