టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన సీఐడీ, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేశారని ఆరోపణలు

Devineni Uma cheating case : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది సీఐడీ

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన సీఐడీ, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేశారని ఆరోపణలు
Devineni Uma
Follow us

|

Updated on: Apr 10, 2021 | 11:16 PM

Devineni Uma cheating case : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది సీఐడీ. తిరుపతి బైపోల్‌ సందర్భంగా.. ఈనెల 7న దేవినేని ఉమ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌ మీట్‌లో ఆయన చూపించిన డిజిటల్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరీ అంటూ సీఐడీ కేసు బుక్‌ చేసింది. ఓ ట్యాబ్‌లో ఆయన చూపించిన వీడియోని ఫోర్జరీ అని.. అది చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కోటి కాదు.. 2కోట్లు కాదు… దాదాపు 4 కోట్లు సీజ్‌ చేశారు. ఎక్కడిది.. ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అటు, తెలంగాణలో గంజాయి దందాకు చెక్‌ పెట్టారు హైదరాబాద్‌ పోలీసులు. ఈ మాఫియాలో కీలక సూత్ర దారి కిన్‌ పిన్‌ బాబు ఖాలేను అరెస్టు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఖాకీలను ముప్పు తిప్పలు పెడుతున్న ఖాలే ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు.

Read also : పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు, వీళ్ల ఉద్యోగాలు గోవిందా.. గోవింద! అంటూ ఎద్దేవా