Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య… తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా

అంతా అనుకున్నట్లే జరిగితే...ఆమె ఖాకీ దుస్తుల్లో ఖతర్నాక్‌గా డ్యూటీ చేసేవారు. ఇప్పటికే ఆమె ట్రైనీ ఎస్‌ఐగా పనిచేశారు. కానీ మనసులో వేధిస్తున్న బాధలేంటో...

Vizianagaram: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య... తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా
Traine Si Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 29, 2021 | 4:48 PM

అంతా అనుకున్నట్లే జరిగితే…ఆమె ఖాకీ దుస్తుల్లో ఖతర్నాక్‌గా డ్యూటీ చేసేవారు. ఇప్పటికే ఆమె ట్రైనీ ఎస్‌ఐగా పనిచేశారు. కానీ మనసులో వేధిస్తున్న బాధలేంటో తెలియదు కానీ ఆమె వేరేలా ఆలోచించింది. అంతే ఇప్పుడు విగత జీవితగా మారిపోయింది. విజయనగరం పోలీసు ట్రైనింగ్‌ హాస్టల్‌లో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య చేసుకుంది. శనివారం ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంది. సొంత జిల్లాకు వెళ్లాల్సిన టైమ్‌లో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. రాత్రి హాస్టల్‌లో ఉన్న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భవానీ సొంతూరు కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామంగా తెలుస్తోంది. తాజగా ఆమెకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టేందుకు వారం ముందు విజయనగరం ట్రైనింగ్ స్టేషన్ లో శిక్షణ నిమిత్తం ఉంచారు. ఈ నేపథ్యంలోనే భవాని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సహచరులను విచారిస్తున్నారు.

మరో ఐదు రోజుల్లో పెళ్లి.. వధువు రోడ్డు ప్రమాదంలో మృతి

మరో 5 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. పెళ్లి పనుల కోసం బైక్‌పై వెళ్తున్న యువతిని, ఆమె తండ్రిని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో.. యువతి శరీరం ఛిద్రమైంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించలోగా తుదిశ్వాస విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా సంతేబిదనూరు కు చెందిన నరసింహమూర్తి ఏకైక కుమార్తె వివాహం సెప్టెంబర్ 2న జరగాల్సింది. పెళ్లి పనుల నిమిత్తం తండ్రీ కూమార్తె కలిసి బైక్‌పై వెళ్తుండగా హిందూపురంలో మోత్కుపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కుమార్తె చైతన్యను హిందూపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందింది. తండ్రి నరసింహమూర్తి కి తీవ్రగాయాలు కాగా.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్ .. కూపీ లాగగా నిజాలు తెలిసి విస్తుపోయిన పోలీసులు

తల్లికూతుళ్లపై కత్తి దూసిన దుర్మార్గుడు.. ఇళ్లంతా రక్తపు మడుగు.. ఇద్దరూ కన్నుమూత