Sattenapalli: తల్లికూతుళ్లపై కత్తితో ఉన్మాది దాడి .. ఇళ్లంతా రక్తపు మడుగు.. ఇద్దరూ కన్నుమూత

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లికూతుళ్లపై కత్తి దూసాడో దుర్మార్గుడు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపాడు.  నాగార్జున నగర్‌లోని...

Sattenapalli: తల్లికూతుళ్లపై కత్తితో ఉన్మాది దాడి .. ఇళ్లంతా రక్తపు మడుగు.. ఇద్దరూ కన్నుమూత
murders
Follow us

|

Updated on: Aug 29, 2021 | 12:31 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లికూతుళ్లపై కత్తి దూసాడో దుర్మార్గుడు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపాడు.  నాగార్జున నగర్‌లోని ఇంట్లో పద్మావతి, ప్రత్యూష ఉంటున్నారు. ఇంట్లో వాళ్లిద్దరే ఉన్న టైమ్‌లో ఎంటరైన శ్రీనివాస్‌రావు ఇద్దరినీ పొడిచాడు. అనంతరం తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ.. కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూ యువతి తన సోదరుడికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేసింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికెళ్లి చూసేసరికి.. తల్లీకూతుళ్లు చనిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అందిర్నీ షాక్‌కు గురిచేసింది.

ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమైందని పోలీసులు తెలిపారు. తల్లీకుమార్తెలను వారి బంధువే హతమార్చినట్లు  డీఎస్పీ విజయభాస్కరరెడ్డి వెల్లడించారు. సత్తెనపల్లి మండలం కట్టమూరు వీఆర్వోగా పనిచేసిన కోనూరు శివప్రసాద్‌ నాలుగేళ్ల కిందట మరణించారని….. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీవో ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నట్లు వివరించారు. తల్లి వెంకట సుగుణ పద్మావతితో కలిసి నాగార్జుననగర్‌లో ఉంటున్న లక్ష్మీనారాయణ.. తన సోదరి లక్ష్మీప్రత్యూషకు  పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సాయితేజస్వికి ఇచ్చి 5నెలల కిందటే వివాహం జరిపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం గర్భిణి అయిన లక్ష్మీప్రత్యూష శ్రావణమాసం కావడంతో సారె కోసం తల్లిగారింటికి భర్తతో సహా వచ్చారని.. తిరిగి అల్లుడు ఒక్కరే స్వగ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. ఇంతలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

Also Read: పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్ .. కూపీ లాగగా నిజాలు తెలిసి విస్తుపోయిన పోలీసులు

వర్షాలకు బయటపడ్డ కరోనా బాధితుడి మృతదేహం.. స్థానికంగా కలకలం

Latest Articles
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో