AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jangareddygudem: వర్షాలకు బయటపడ్డ కరోనా బాధితుడి మృతదేహం.. స్థానికంగా కలకలం

ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిల్వచేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే...

Jangareddygudem: వర్షాలకు బయటపడ్డ కరోనా బాధితుడి మృతదేహం.. స్థానికంగా కలకలం
Corona Dead Body
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2021 | 4:49 PM

Share

ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిల్వచేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాలకు ఖననం చేసిన మృతదేహం బయటపడటం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజారాణి కల్యాణ మండపం సమీపంలోని శ్మశాన వాటికలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  ఐదు నెలల కిందట కరోనాతో మృతి చెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఈ శ్మశాన వాటికలో ఖననం చేశారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి డెడ్‌బాడీ బయటపడింది. దీనిని గుర్తించిన పోలీసులు పురపాలక అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఆ మృతదేహాన్ని తిరిగి ఖననం చేయించామని పురపాలక కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. కరోనా బాధితుల మృతదేహాలను నిబంధనల మేరకు పూడ్చకపోవడం వల్లే ఇలా బయటపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ఇంకెన్ని బయట పడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1000పైనే కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 64,461 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1321 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1321 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,10,566కి పెరిగింది. కొత్తగా కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,807కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1499 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధి బారినుంచి బయటపడినవారి సంఖ్య 19,81,906కి చేరింది. ప్రస్తుతం 14,853 యాక్టివ్ కేసులున్నాయి.

Also Read:భారత్‌లో టెన్షన్ పెడుతున్న కొత్త కేసులు, మరణాలు.. తాజా వివరాలు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులు అలెర్ట్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా