AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై కోపం భర్తకు శాపమైంది.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి.. చివరకు..

దంపతుల మధ్య తలెత్తిన గొడవలు భారీ మూల్యం చెల్లించుకునేలా చేశాయి. మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్యలను.. తీవ్రంగా భావించాడు అతను. భార్యతో గొడవలు, ఆర్థిక సమస్యలు...

భార్యపై కోపం భర్తకు శాపమైంది.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి.. చివరకు..
Train
Ganesh Mudavath
|

Updated on: Feb 22, 2023 | 7:24 AM

Share

దంపతుల మధ్య తలెత్తిన గొడవలు భారీ మూల్యం చెల్లించుకునేలా చేశాయి. మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్యలను.. తీవ్రంగా భావించాడు అతను. భార్యతో గొడవలు, ఆర్థిక సమస్యలు అతనిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. తీవ్ర మనస్తాపంతో స్టేషన్ లో ఎదురుగా వస్తున్న రైలు కిందకు వెళ్లి దూకాడు. ఈ ఘటనలో అతని మృతదేహం ఇంజిన్ లో ఇరుక్కుపోయింది.. ఉత్తర ప్రదేశ్ లోని పచఖోరా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్.. అమ్రోహాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం గుర్వీందర్ సింగ్ కు వివాహమైంది. వీరికి ఏడేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

కొన్ని రోజులుగా వీరి ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గుర్వీందర్ సింగ్.. పనికి వెళ్తుండగా భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. తర్వాత నేరుగా కైలసా రైల్వే స్టేషన్​కు వెళ్లాడు. ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకాడు. ఈ ఘటనలో గుర్వీందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతదేహం ఇంజిన్​లో ఇరుక్కుపోయింది. దీంతో డెడ్ బాడీని రైలు ఐదు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.