Accident: ఆలయానికి వెళుతుండగా.. లోయలోకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..

Truck Falls Into Gorge in UP: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ట్రక్ లోయలో పడటంతో 12 మంది

Accident: ఆలయానికి వెళుతుండగా.. లోయలోకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది దుర్మరణం..
Truck Falls Into Gorge In Up
Follow us

|

Updated on: Apr 11, 2021 | 7:56 AM

Truck Falls Into Gorge in UP: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ట్రక్ లోయలో పడటంతో 12 మంది మరణించారు. 45 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యూపీలోని ఎటావా జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వారంతా కాళికా దేవి ఆలయానికి వెళుతుండంగా బార్‌పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రా జిల్లాకు చెందిన సుమారు 60 మంది లఖ్నా ప్రాంతంలోని కాళికా దేవి ఆలయానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ట్రక్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. ట్రక్ లోయలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు వెల్లడించారు.

గాయపడిన 45 మందిలో 13మందికి తీవ్ర గాయాలయ్యాయని వారికి ఉన్నత వైద్యం కోసం సైఫాయిలోని పీజీఐ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ ప్రశాంత్ కుమార్ ప్రసాద్ తెలిపారు.

కాగా.. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. చనిపోయిన వారందరికీ.. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన వారికి ఉన్నత వైద్యం అందించాలని యోగి అధికారులను ఆదేశించారు.

Also Read:

Indonesia Earthquake: ఇండోనేషియాను వణికిస్తున్న విపత్తులు.. భారీ భూకంపం.. ఆరుగురు మృతి

Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా..

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది