AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచవ్యాప్తంగా 82 లక్షలకు చేరిన కేసులు.. టెర్రర్ పుట్టిస్తోన్న కరోనా..

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం...

ప్రపంచవ్యాప్తంగా 82 లక్షలకు చేరిన కేసులు.. టెర్రర్ పుట్టిస్తోన్న కరోనా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2020 | 8:16 AM

Share

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మంగళవారం 141377 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 82,50,004కి చేరాయి. అలాగే నిన్న 4379 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,45,174కి చేరింది. ఇక ప్రస్తుతం 3505670 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4299200గా ఉంది.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. ఒక్కోసారి జోరు బాగా తగ్గినట్లు కనిపిస్తున్నా.. మరోసారి బాగా పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం కొత్తం 24,846 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2207796కి చేరాయి. అలాగే నిన్న 844 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 119127కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక చైనాలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. నిన్న తాజాగా 40 కేసులు నమోదయ్యాయి.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా భారత్‌లో 10667 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 343091కు చేరుకుంది. ఇందులో యాక్టీవ్ కేసుల సంఖ్య 180012గా ఉంది. కాగా క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారు 17 వేలకు పైగా ఉన్నారు. ఇక దేశం మొత్తం 10 వేలు దాటాయి. ప్ర‌స్తుతం వ్యాధి నుంచి రిక‌వ‌రీ రేటు 52.5 శాతంగా ఉండ‌టం కాస్త ఊర‌ట క‌లిగించే అంశం. కాగా ప్ర‌జంట్ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.

Read More: 

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం..