AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Pandemic: కరోనా నియంత్ర కోసం అంటూ సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంపు .. ఎంతమేర అంటే..

Coronavirus Pandemic: గత ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై...

Coronavirus Pandemic: కరోనా నియంత్ర కోసం అంటూ సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంపు .. ఎంతమేర అంటే..
Platform Ticket Price
Surya Kala
|

Updated on: Apr 12, 2021 | 9:44 PM

Share

Coronavirus Pandemic: గత ఏడాది జనవరిలో మనదేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కరోనా వైరస్ నివారణ కోసం చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చి 22 నుంచికేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ కూడా విధించింది. అనంతరం అంచెలంచెలుగా లాక్ డౌన్ ను సడలించింది. ఓ వైపు కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ షన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుతాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తుంది. అయితే మరోవైపు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచిస్తుంది.

అయితే గత ఏడాది చివరి నుంచి ప్రజలు మాస్కులకు దూరంగా ఉంటున్నారు.. ఇక దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో మహారాష్ట్ర లో లాక్ డౌన్.. రాత్రి వేళల్లో కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తికి చెక్ పెట్టడానికి రంగంలోకి దిగింది. ఇప్పటికే మాస్కులు లేకుండా రోడ్డు మీదకు వచ్చినా.. బస్సుల్లో రద్దీ ప్రదేశాల్లో కనిపించినా వెయ్యి రూపాయల ఫైన్ వేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కరోన కట్టడి కోసం మరికొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ని నియంత్రించేందుకు ప్లాట్ ఫార్మ్ టికెట్స్ ధరలను పెంచింది. మంగళవారం (ఏప్రిల్ 13 ) నుంచి ఈ పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకూ రూ 30 ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 50 లకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పెంచిన ధరలు ఉగాది రోజునుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు.

Also Read: ముఖం, గెడ్డం దగ్గర కొవ్వు పేరుకుందా.. సింపుల్ చిట్కాలను ఫాలోకండి

రోబో టెక్నాలజీ మహాభారతంలోనే ఉందా.. బార్బరీక్ ఎవరో తెలుసా..కృష్ణుడు ఎందుకు చంపాడంటే..!

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!