AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగర్‌కర్నూల్‌లో కరోనా కలకలం..ఒకరికి పాజిటివ్

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలవుతున్న‌ప్ప‌టికీ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ..

నాగర్‌కర్నూల్‌లో కరోనా కలకలం..ఒకరికి పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2020 | 5:27 PM

Share
క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలవుతున్న‌ప్ప‌టికీ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో క‌రోనా కేసు న‌మోదం కావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. కాగా, జిల్లాలోనే ఇది క‌రోనా తొలికేసుగా వైద్యాధికారులు వెల్ల‌డించారు.
రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ జ‌డ‌లువిప్పుకుంటోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చాడని తెలిసింది. నాగర్‌ కర్నూల్ జిల్లా నుంచి మొత్తం 11 మంది నిజాముద్దీన్‌ వెళ్లినట్లు గుర్తించామని.. వారి నమూనాలను పరీక్షలకు పంపించిన‌ట్లుగా చెబుతున్నారు స్థానిక డీఎంహెచ్‌వో సుధాక‌ర్‌. అందులో 10 మంది వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చాయని.. వాటిలో తొమ్మిది మందికి నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..మరొకరి రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు సుధాకర్ లాల్. కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తామని చెప్పారు. అంతేకాదు అతడితో దగ్గరగా మెలిగిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు.