AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్: మహారాష్ట్రలో జులై 31 వరకు లాక్‌డౌన్..

ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్‌కి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్..

బ్రేకింగ్ న్యూస్: మహారాష్ట్రలో జులై 31 వరకు లాక్‌డౌన్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2020 | 5:00 PM

Share

ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్‌కి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నాయి. అలాగే పలు కీలక ఆంక్షలు పెడుతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జులై 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఆయా ప్రాంతాల్లోని కరోనా తీవ్రతను బట్టి ఆ జిల్లా అధికారులు ఆంక్షలు విధించాలని ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్ర సర్కార్. అత్యవసరం కాని కార్యకలాపాలను కట్టడి చేయాలని స్పష్టం చేసింది.

ఇక మహారాష్ట్రలోనూ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో అత్యధికంగా మహాలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,64,626 కేసులు నమోదవ్వగా, దేశంలోనే అత్యధికంగా 7,429 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 70,622 కేసులు యాక్టీవ్‌గా ఉండగా, 86,575 మంది రికవరీ అయ్యారు.

కాగా ఇక దేశ వ్యాప్తంగా సోమవారం నాడు కొత్తగా 19,459 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,21,723 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 16,475 మంది మరణించారు.

Read More: 

వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

Follow Us
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ
లంకను తగలెట్టిన వైభవ్ సూర్యవంశీ