AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు…

గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటరని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ 19కు సరైన వసతులు లేవని అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు...
Ravi Kiran
|

Updated on: Apr 24, 2020 | 11:03 AM

Share

గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటరని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ 19కు సరైన వసతులు లేవంటూ అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. గాంధీలో పేషంట్లు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో తనకు వివరించారని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని.. ఆహారం బాగా లేదని, మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని వాపోయారు.

కేవలం సామాజిక దూరం పాటించిన మాత్రాన వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేమని.. పరిసరాలు కూడా పరిశుభ్రతగా ఉండాలని ఆయన అన్నారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా సెక్రటేరియట్‌లో కూడా కరోనా అనుమానితుల క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టెస్టులు సంఖ్య కూడా పెంచాలని తెలిపారు.

ఇక లోకల్ ఆసుపత్రిలలో ఓపి సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అక్బరుద్దీన్ కోరారు. కాగా, కరోనా వైరస్ కేసులు ఇంకా పెరిగి… పరిస్థితులు అద్వాన్నంగా మారితే ఓవైసీ గ్రూప్స్ ఆసుపత్రిలు, డాక్టర్లు, నర్సులు కోవిడ్ 19తో పోరాడటానికి సిద్డంగా ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు. మరి ఈ సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..