AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 vaccination: దేశవ్యాప్తంగా జోరందుకున్న వ్యాక్సినేషన్.. 31కోట్లకు చేరువైన టీకా తీసుకున్న వారి సంఖ్య..!

దేశంలో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంది. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.

COVID-19 vaccination: దేశవ్యాప్తంగా జోరందుకున్న వ్యాక్సినేషన్.. 31కోట్లకు చేరువైన టీకా తీసుకున్న వారి సంఖ్య..!
Covid Vaccination
Balaraju Goud
|

Updated on: Jun 23, 2021 | 2:38 PM

Share

India’s COVID-19 vaccination record: దేశంలో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంది. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 29 కోట్ల 12 లక్షల 72 వేల 058 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 23 కోట్ల 98 లక్షల 34 వేల 542 మందికి మొదటి డోస్‌ అందగా.. 5 కోట్ల 14 లక్షల 37 వేల 516 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 16 లక్షల 33 వేల 342 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 40 లక్షల 65 వేల 409 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. కోటి 13 లక్షల 11 వేల 343 మందికి మొదటి డోస్‌ అందగా.. 27 లక్షల 54 వేల 66 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 95 లక్షల 24 వేల 861 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 81 లక్షల 12 వేల 461 మంది. రెండో డోస్‌ తీసుకున్న వారు 14 లక్షల 12 వేల 400 మంది.

ఇక, ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 25 కోట్ల 64 లక్షల 32 వేల 306 మందికి covisheild అందితే.. 3 కోట్ల 47 లక్షల 91 వేల 443 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 31 కోట్ల 81 లక్షల 57 వేల 448 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 14 కోట్ల 27 లక్షల 62 వేల 699 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 17 కోట్ల 53 లక్షల 94 వేల 748 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. కరోనా తీవ్రత తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందరం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.. Read Also…. Corona : హైకోర్టు విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీ‌నివాసరావు

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?