AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groom Dies: యూపీలో విషాదం… నవ వరుడి ప్రాణాలను మింగేసిన కరోనా మహమ్మారి.. పెళ్లైన 72 గంటలకే మృతి

Groom Died With Corona: కంటికి కనిపించని శత్రువు.. కాటు వేసి కళ్లు తెరిచేలోపే కాటికి పంపుతోంది. చాప కింద నీరు పాకుతున్న కరోనా మహమ్మారి తేరుకునే సరికే పని కానిచ్చేస్తోంది. తాజా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నవవరుడిని మింగేసింది. బిజ్నౌర్‌లో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెళ్లైన 72 గంట‌ల వ్యవ‌ధిలోనే వ‌రుని ఆనందాన్ని క‌రోనా లాగేసుకుంది. క‌రోనా కార‌ణంగా వ‌రుడు వివాహం జరిగిన రెండు రోజుల‌కే క‌న్నుమూశాడు. పెళ్లి తంతు పూర్తి అయ్యిన మరునాడే పెళ్లి […]

Groom Dies: యూపీలో విషాదం... నవ వరుడి ప్రాణాలను మింగేసిన కరోనా మహమ్మారి.. పెళ్లైన 72 గంటలకే మృతి
Balaraju Goud
|

Updated on: May 01, 2021 | 7:24 AM

Share

Groom Died With Corona: కంటికి కనిపించని శత్రువు.. కాటు వేసి కళ్లు తెరిచేలోపే కాటికి పంపుతోంది. చాప కింద నీరు పాకుతున్న కరోనా మహమ్మారి తేరుకునే సరికే పని కానిచ్చేస్తోంది. తాజా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నవవరుడిని మింగేసింది. బిజ్నౌర్‌లో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెళ్లైన 72 గంట‌ల వ్యవ‌ధిలోనే వ‌రుని ఆనందాన్ని క‌రోనా లాగేసుకుంది. క‌రోనా కార‌ణంగా వ‌రుడు వివాహం జరిగిన రెండు రోజుల‌కే క‌న్నుమూశాడు. పెళ్లి తంతు పూర్తి అయ్యిన మరునాడే పెళ్లి కొడుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వ‌రుడిని ఆసుప‌త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు.

యూపీలోని బిజ్నౌర్‌కు చెందిన అర్జున్‌కు ఏప్రిల్ 25న చాంద్‌పూర్‌కు చెందిన యువతితో వివాహం జ‌రిగింది. పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో అప్పగింత‌ల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఊరేగింపుగా వ‌ధూవ‌రులు వ‌రుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంత‌లోనే వ‌రుడు అర్జున్‌కు అనారోగ్యానికి గురయ్యాడు. వెంట‌నే అత‌నిని ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ వైద్య పరీక్షల్లో అత‌నికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అర్జున్‌కు కోవిడ్ `19 వార్డుకు త‌ర‌లించారు. అయితే అక్కడ అతని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారింది. ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ అందుబాటులో లేనికార‌ణంగా వ‌రుడు క‌న్నుమూశాడు. ఈ విష‌యం తెలియ‌గానే బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత‌లో వ‌ధువు కూడా అనారోగ్యం పాల‌య్యింది. వెంట‌నే ఆమెకు క‌రోనా టెస్టులు చేయించారు. అయితే ఆమెకు క‌రోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా, ఈ పెళ్లికి హాజరైన అతిథులు సైతం వరుసగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారి రిపోర్టు రావాల్సి ఉందని సమాచారం.

Read Also…. Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరి కొంతమంది పరిస్థితి..

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు