హైదరాబాద్లో తీవ్రంగా విజృంభిస్తోన్న కరోనా కేసులు.. దృష్టిసారించిన బల్దియా
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ తీవ్రంగా విజృంభిస్తూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ మినహా.. ఇతర అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడ్డాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో..
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ తీవ్రంగా విజృంభిస్తూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ మినహా.. ఇతర అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడ్డాయి. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం వరకూ నగరంలోనే కావడం వల్ల బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. చార్మినార్ జోన్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్నటివరకూ 332 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా పాజిటివ్ కేసులు ఉన్న పరిధిలో మొత్తం 106 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎల్బీనగర్ జోన్లో కరోనా పాజిటివ్ కేసులు 16, కంటైన్మెంట్ జోన్లు 14, నగరంలో అత్యధికంగా చార్మినార్ జోన్లో 219 కేసులు నమోదు కాగా.. 52 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో రెండు సార్లు శానిటైజ్ చేసి.. ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య స్థితిని గమనిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
Read More:
బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం
తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!
బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..
ఉదయ్ కిరణ్ చావుకు ఆ అగ్ర హీరోకి సంబంధం లేదు.. తేల్చిచెప్పిన తేజ!