AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరీంనగర్ లో డిసిన్ఫెక్షన్ టన్నల్ ఏర్పాటు

కరీంనగర్ జిల్లాను ఇంకా క‌రోనా వెంటాడుతోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరీంనగర్ బస్టాండ్ వద్ద డిసిన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. వైరస్ సంక్రమణ నిరోధం కోసం..

కరీంనగర్ లో డిసిన్ఫెక్షన్ టన్నల్ ఏర్పాటు
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2020 | 11:52 AM

Share
కరీంనగర్ జిల్లాను  క‌రోనా వెంటాడుతోంది. బుధ‌వారం వ‌ర‌కు కరీంనగర్ 18, జగిత్యాల 03,పెద్ధపల్లి 02 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కరీంనగర్‌లోనే 73 మంది అనుమనితులకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు.. హుజురాబాద్ లో 03 పాజిటివ్ కేసులు నమోదవడం తో ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్ విధించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల 20 మంది కుటుంబ సభ్యులతో పాటు 26 మందిని ఐసోలేషన్ కు తరలించారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరీంనగర్ బస్టాండ్ వద్ద డిసిన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేశారు. బస్టాండ్ వద్ద కరోనా వైరస్ సంక్రమణ నిరోధం కోసం ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోనికి ప్రవేశించే వారంతా ఈ యంత్రం గుండానే రావలసి ఉంటుంది. ఆ సమయంలో కళ్లు మూసుకోవలసి ఉంటుందన్న హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక 15 వైద్య బృందాలతో పరీక్షలు కొనసాగుతున్నాయి.
పెద్డపల్లి జిల్లాలో 02 పాజిటివ్ కేసులు నమోదవడం తో 31 మంది అనుమనితులకు పరీక్షలు నిర్వహించగా. 29 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,218 మందిలో 1, 047 మందికి హోమ్ క్వారంటైన్ పూర్తి అయింది.. ప్రస్తుతం పెద్ధపల్లి జిల్లా ఐసోలేషన్ లో 23,క్వారంటీన్ లో 68 ఉన్నారు. అలాగే జగిత్యాల్లో వైద్య పరీక్షలు కొనసాగిస్తున్నారు. కోరుట్ల పరిధిలోని భీముని దుబ్బ, రెహమత్ పూర్, కల్లూరు, సర్ఫరాజ్ పూర్ లో నిషేధాజ్ఞలు విధించారు.
జిల్లా పరిధిలో 2వేల మంది హోమ్ క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు.. జె ఎన్ టి యు, పొలాస కళాశాలలో ఢిల్లీ ,హర్యానా నుంచి వచ్చిన 85 మందిని క్వారంటైన్ లో ఉంచారు.. కాగా, 123 మంది శాంపిల్స్ పంప‌గా, 20 మంది రిజల్ట్స్ కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.