Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron COVID-19 Variant: ఢిల్లీలో బయటపడిన మొదటి ఒమిక్రాన్‌ బాధితుడి లక్షణాలు ఇలా.. ఆక్సిజన్ స్థాయి ఎలా ఉందంటే..

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ దూసుకెళ్లింది. ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలో జరిగిన..

Omicron COVID-19 Variant: ఢిల్లీలో బయటపడిన మొదటి ఒమిక్రాన్‌ బాధితుడి లక్షణాలు ఇలా.. ఆక్సిజన్ స్థాయి ఎలా ఉందంటే..
Delhi Reports Corona First
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 05, 2021 | 8:35 PM

Delhi Reports Corona First Case: దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ దూసుకెళ్లింది. ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలో జరిగిన నమూనా పరీక్షలో ఈ వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి మొదట్లో గొంతునొప్పి, జ్వరం ఉన్నట్లు ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

రోగిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే అంశంపై ఎల్‌ఎన్‌జేపీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఓమిక్రాన్ సోకిన రోగి రెండు డోస్‌లు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారని తెలిపారు. ఈ వ్యక్తికి గతంలో గొంతు నొప్పి, జ్వరం వచ్చింది. అలాగే రోగికి శరీర నొప్పి ఉంది. అతను బలహీనంగా ఉందని ఫిర్యాదు చేసాడు. కానీ అతని ఆక్సిజన్ స్థాయి పడిపోలేదని.. అది స్థిరంగా ఉందన్నారు.

వైద్యుల బృందం 24 గంటల పాటు రోగిని పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. రోగి శరీరంలో జరిగే మార్పులపై వైద్యులు ఓ కన్నేసి ఉంచుతున్నారని తెలిపారు.

అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆసుపత్రి వైద్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగితే ఈ అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికకు సమయం పడుతుందని, నివేదిక 4 నుండి 5 రోజుల్లో వస్తుందని, కాబట్టి ఈ సమయంలో విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆఫ్ కరోనాను నివారించడానికి, టీకా యొక్క రెండు డోస్‌లు తప్పనిసరిగా వేయాలని, అలాంటి వ్యక్తికి ఓమిక్రాన్ ఉన్నప్పటికీ, అతనికి ఐసియు అవసరం లేదని సురేష్ కుమార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

Hyderabad: పట్టపగలు దడపుట్టిస్తున్న పోకిరీలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్య బైక్ స్టంట్స్..