AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో 17 వేలు దాటిన కరోనా కేసులు, మృతులు 543…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1324 కేసులు, 31 మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటివరకు 17265 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 14,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 2547 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 543కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కరోనా వైరస్ తీవ్రత […]

దేశంలో 17 వేలు దాటిన కరోనా కేసులు, మృతులు 543...
Ravi Kiran
|

Updated on: Apr 20, 2020 | 9:19 AM

Share

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 1324 కేసులు, 31 మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటివరకు 17265 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 14,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 2547 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 543కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఏపీ-646, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 15, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 35, బీహార్ – 93, ఛండీగర్-26, ఛత్తీస్‌ఘడ్‌-36, ఢిల్లీ-2003, గోవా-7, గుజరాత్-1743, హర్యానా-233, హిమాచల్‌ప్రదేశ్-39, జమ్ముకశ్మీర్-350, జార్ఖండ్ – 42, కర్ణాటక- 390, కేరళ-402, లడాక్-18, మధ్యప్రదేశ్‌-1407, మహారాష్ట్ర-4203, మణిపూర్‌-2, మిజోరం- 1, మేఘాలయా- 11, నాగాలాండ్- 0, ఒడిశా – 68, పుదుచ్చేరి -7, పంజాబ్-219, రాజస్థాన్-1478, తమిళనాడు-1477, తెలంగాణ-844, త్రిపుర – 2, ఉత్తరాఖండ్ – 44, యూపీ-1084, పశ్చిమ బెంగాల్-339 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(223)లో సంభవించగా.. ఆ తర్వాత మధ్యప్రదేశ్(70), గుజరాత్(63), ఢిల్లీ(45), తెలంగాణ(18) రాష్ట్రాలు ఉన్నాయి.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…