AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌ సింగర్‌కు ఊరట.. టెస్ట్‌లో నెగిటివ్‌.. కానీ..!

కరోనా బారిన పడిన బాలీవుడ్‌ సింగర్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. తాజాగా జరిగిన టెస్ట్‌లో ఆమెకు నెగిటివ్‌గా వచ్చింది. గతంలో పలుమార్లు జరిగిన టెస్ట్‌లో పాజిటివ్‌ రాగా.. ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బాలీవుడ్‌ సింగర్‌కు ఊరట.. టెస్ట్‌లో నెగిటివ్‌.. కానీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 9:00 PM

Share

కరోనా బారిన పడిన బాలీవుడ్‌ సింగర్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. తాజాగా జరిగిన టెస్ట్‌లో ఆమెకు నెగిటివ్‌గా వచ్చింది. గతంలో పలుమార్లు జరిగిన టెస్ట్‌లో పాజిటివ్‌ రాగా.. ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజా రిపోర్టులో నెగిటివ్‌ రావడంతో.. సింగర్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్లు, ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తదుపరి రిపోర్ట్ వచ్చే వరకు ఆమెను అబ్జర్వేషన్‌లోనే ఉంచబోతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే బ్రిటన్ నుంచి వచ్చిన సింగర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక బ్రిటన్ నుంచి వచ్చిన తరువాత ఆమె ఓ విందులో హాజరయ్యారు. ఈ విందులో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. మరోవైపు ఆసుపత్రిలో చేరిన సింగర్‌కు జరిగిన టెస్ట్‌లో ఐదు సార్లు పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ఆందోళనకు గురైన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా క్రైసిస్‌: అమ్మ నాన్న స్పూర్తితో.. రాజశేఖర్ కుమార్తెల ఉదారభావం..!