భారత్లో కరోనా విజృంభణ.. 33 వేలు దాటిన కోవిడ్ కేసులు
పటిష్టంగా లాక్డౌన్ అమలు పరుస్తున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. బుధవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేల మార్క్ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా 33050 పాజిటివ్ కేసులు..

భారత్లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పటిష్టంగా లాక్డౌన్ అమలు పరుస్తున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. బుధవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేల మార్క్ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 33050 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య ఏకంగా 1074కి చేరింది. ఇక 8325 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 23,651 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలా వరకూ సడలించారు. అయితే హాట్ స్పాట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మే 3 తరువాత ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Read More:
వెహికల్ ట్యాక్స్పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం