గుడ్న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!
ఇదే సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో అమేజాన్ పే లెటర్ క్రెడిట్ సర్వీస్ని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనికి కొన్ని షరతులు..

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, పలు మీడియా సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఇది కొంతవరకూ బాగానే ఉన్నా.. ప్రైవేటు ఉద్యోగులు, దినసరి కూలీలకు మాత్రం సంపాదన లేక పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో ఇప్పటికే ఆర్బీఐ వివిధ లోన్లపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది. అందంతా ఓ వైపు అయితే.. లాక్డౌన్ తర్వాత కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎవరి దగ్గర చూసినా ఆదాయం నిల్.
ఇదే సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో అమేజాన్ పే లెటర్ క్రెడిట్ సర్వీస్ని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా పెట్టింది. అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే ఇది వర్తించనుంది. అంటే ఎంపిక చేసిన ప్రోడక్ట్స్కు (నిత్యావసరాలు) డబ్బులు లేకపోయినా అమెజాన్ పే లెటర్ ద్వారా వస్తువులు కొని.. గడువులోగా ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించుకునే వెసులు బాటును కల్పిస్తోంది.
ఇక ఇది కూడా కుదరకపోతే.. ఈఎంఐ (EMI) ఆప్షన్ను తీసుకొచ్చింది. 12 నెలల వరకూ ఈఎంఐ ద్వారా మీరు కొన్న సరుకులు లేదా వస్తువులకు డబ్బులు చెల్లించవచ్చు. అయితే ఈఎంఐకి మాత్రం 1.5 నుంచి 2 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మొత్తానికి అమెజాన్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించుకునే అవకాశంతో పాటు ఇప్పుడు నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ల క్రెడిట్ ఎలిజిబిలిటీ బట్టి రూ.60 వేల వరకూ అప్పు ఇస్తోంది అమేజాన్. మీరు ఈ సర్వీసును ఉపయోగించుకోవాలంటే.. అమేజాన్ ఇండియా యాప్లో మొదట రిజిస్టర్ అయి ఉండాలి.
Read More: తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ