AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. నేల కూలిన ఐదు గదులు! కొనసాగుతున్న రెస్క్యూ!

తమిళనాడులో ఘోరప్రమాదం జరిగింది. శివకాశి జిల్లాలోని పుదుపట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు కార్మికులకు గాయాలయినట్టు తెలుస్తోంది. భారీ పేలుడు దాటికి సుమారు ఐదు గదులు నేల కూలినట్టు సమాచారం.

తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. నేల కూలిన ఐదు గదులు! కొనసాగుతున్న రెస్క్యూ!
Firework Factory In Gujarat
Anand T
|

Updated on: Apr 26, 2025 | 2:01 PM

Share

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. భారీగా బాణసంచా పేలడంతో ఆ తయారీ కేంద్రంలో ఐదు గదులు నేల కూలాయి. దీంతో వాటి శిథిలాల కింద పడి బాణసంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు కూలిన శిథిలాల కింద చిక్కుకున్నారు. శివకాశి జిల్లాలోని పుదుపట్టిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, స్థానిక అధికారుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదంలో గాయపడిన కార్మికులను అంబులెన్స్‌ల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…