భర్త వేధిస్తున్నాడని కరెంట్షాక్తో చంపి పాతిపెట్టిన భార్య
హైదరాబాద్లోని KPHB కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్తో చంపేసి పూడ్చిపెట్టిందో మహిళ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సొంతూరికి వెళ్లిపోయింది. KPHB కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత దంపతులు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భార్య, భర్తలిద్దికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి.
దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కవిత తన సొంతూరు వెళ్లి.. భర్త సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని అక్కడి వారితో చెప్పింది.అనుమానం వచ్చిన ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. భార్యే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 18న భర్త వేధింపులు భరించలేక సాయిలును భార్యే విద్యుత్షాక్ పెట్టి చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సమాచారం. దీనికి ఆమె తన చెల్లెలి భర్త సహకారం తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుక్క నీటి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహిళ గుండెల్ని పిండేస్తున్న దృశ్యం
శివాలయంలో అద్భుతం.. తండోపతండాలుగా భక్తజనం
300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

