భర్త వేధిస్తున్నాడని కరెంట్షాక్తో చంపి పాతిపెట్టిన భార్య
హైదరాబాద్లోని KPHB కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్తో చంపేసి పూడ్చిపెట్టిందో మహిళ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సొంతూరికి వెళ్లిపోయింది. KPHB కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత దంపతులు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భార్య, భర్తలిద్దికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి.
దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కవిత తన సొంతూరు వెళ్లి.. భర్త సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని అక్కడి వారితో చెప్పింది.అనుమానం వచ్చిన ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. భార్యే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 18న భర్త వేధింపులు భరించలేక సాయిలును భార్యే విద్యుత్షాక్ పెట్టి చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సమాచారం. దీనికి ఆమె తన చెల్లెలి భర్త సహకారం తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుక్క నీటి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహిళ గుండెల్ని పిండేస్తున్న దృశ్యం
శివాలయంలో అద్భుతం.. తండోపతండాలుగా భక్తజనం
300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

