బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఆధార్తో రూ.50 లక్షల వరకు లోన్
సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ డబ్బు సదుపాయం కాక చాలామంది బిజినెస్ చేయాలన్న కల కలగానే మిగిలిపోతోంది. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. అందులో ఒకటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తు చేయడం మొదలు ఎంపిక వరకు అంతా పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించే స్కీం ఇది. స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు కేంద్రం రుణాన్ని అందజేస్తోంది. గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. గతంలో ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకాలను కలిపి పీఎంఈజీపీగా ప్రారంభించారు.
సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రాల పరిధిలో కేవీఐసీ బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ పథకాన్ని అందజేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు మధ్యతరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు. కేవలం కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మాత్రమే లోన్లు ఇస్తారు. కొత్తగా పెట్టే తయారీ యూనిట్కు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. సర్వీస్ యూనిట్లకైతే 20 లక్షల రూపాయల వరకు లోన్ సదుపాయం కల్పిస్తారు. గతంలో మొత్తం 20 లక్షల రూపాయల వరకే ఉండేది. జనరల్ కేటగిరి వ్యక్తులు యూనిట్ మొత్తం వ్యయంలో 10 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు ఐదు శాతం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు గరిష్టంగా 30 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం రాయితీ ఇస్తారు. ఈ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అయితే జనరల్ కేటగిరి అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యూనిట్కు 25 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ స్కీం కింద లబ్ధిదారుల దరఖాస్తు నుంచి ఎంపిక వరకు మొత్తం ఆన్లైన్లోనే సాగుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో

వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి

వీడు ఎవడండీ బాబూ... 77 సార్లు 100కి కాల్ చేసిన తాగుబోతు వీడియో

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

విభిన్నంగా పెళ్లి పిలుపు - ఆ మాత్రం క్రియేటివిటీ లేకపోతే ఎలా..?

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

కొడుకు చేతికి ఫోన్ ఇస్తే..తల్లికే చుక్కలు చూపెట్టాడుగా వీడియో
