AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?

ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?

Phani CH
|

Updated on: May 23, 2026 | 11:18 AM

Share

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ వంటి యూపీఐ యాప్‌ల ద్వారా కేవలం పిన్ ఎంటర్ చేసి పీఎఫ్ డబ్బులు వెంటనే విత్‌డ్రా చేసుకునే సదుపాయం రానుంది. అలాగే ప్రత్యేక పీఎఫ్ ఏటీఎం కార్డు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసే ఫీచర్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.

మీరు ఉద్యోగం చేస్తున్నారా? ప్రతీ నెలా మీ శాలరీ నుంచి పీఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం… చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పింది! ఇప్పటివరకు మీ పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను అత్యవసర సమయాల్లో విత్‌డ్రా చేసుకోవాలంటే.. ఈపీఎఫ్‌ఓ కార్యాలయం‌ చుట్టూ తిరగాలి, లేదా ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి, ఆపై మీ బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఇంత చేసినా ఆ డబ్బులు మీ అకౌంట్‌కు రావడానికి రోజులు, కొన్నిసార్లు వారాల సమయం పట్టేది. ఆసుపత్రి ఖర్చులు లేదా పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో ఆ డబ్బులు సకాలంలో అందక ఎంతమంది ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడా పరిస్థితిని మార్చనుంది కేంద్రం. ఇకపై పీఎఫ్ టెన్షన్లన్నీ మర్చిపోండి! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను పూర్తిగా మార్చేస్తోంది. మీ మొబైల్‌లో గూగుల్ పే, ఫోన్ పే లేదా భీమ్ యాప్స్ ద్వారా కూరగాయలు కొన్నంత ఈజీగా.. కేవలం మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీ పీఎఫ్ డబ్బులను సెకన్ల వ్యవధిలో మీ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు! అంతేకాదు.. బ్యాంకులు మీకు ఇచ్చే డెబిట్ కార్డు తరహాలోనే, ఈపీఎఫ్‌ఓ కూడా ఒక ప్రత్యేకమైన ‘పీఎఫ్ ఏటీఎం కార్డు’ ఇవ్వబోతోంది. దీనితో మీరు ఏ ఏటీఎం నుంచైనా నేరుగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. అక్షరాలా నిజం! స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఈ విషయాలను అధికారికంగా వెల్లడించారు. దేశంలోని దాదాపు 7 కోట్లకు పైగా ఉన్న ఈపీఎఫ్‌ఓ చందాదారులకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక మంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రాజెక్ట్‌పై శరవేగంగా పని చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. సరికొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ద్వారా ఒక ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలోని కొంత భాగాన్ని భవిష్యత్తు నిధి కోసం ఫ్రీజ్‌ చేసి, మిగిలిన పెద్ద మొత్తాన్ని యూపీఐ గేట్‌వే ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి తీసుకునేలా డిజైన్ చేస్తున్నారు. చందాదారులు తమ మొబైల్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వగానే, వారికి ఎంత ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ అందుబాటులో ఉందో స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. అందులోంచి మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంచుకుని, మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానించిన యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే, ఆ డబ్బు అత్యంత సురక్షితంగా మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఇలా మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ అయిన తర్వాత, మీరు డిజిటల్‌గా ఎవరికైనా పేమెంట్లు చేసుకోవచ్చు లేదా మీ సాధారణ డెబిట్ కార్డును ఉపయోగించి బ్యాంకు ఏటీఎంల ద్వారా క్యాష్ రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. 7 కోట్ల మంది వినియోగదారుల డేటాను తట్టుకునేలా, ఎలాంటి సర్వర్ లోపాలు రాకుండా ఈపీఎఫ్‌ఓ తన సాఫ్ట్‌వేర్‌ను మరింత ఆధునీకరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం మన పీఎఫ్ అకౌంట్ లోని డబ్బులను విత్‌డ్రా చేసుకోవాలంటే ఒక పెద్ద ప్రహసనమే నడుస్తోంది. ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లి, ఫామ్-31 లేదా ఇతర ఫామ్‌లను సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, స్కాన్ చేసిన చెక్ బుక్ లీఫ్ లేదా పాస్‌బుక్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. చాలా సార్లు ఇవి సరిగ్గా స్కాన్ అవ్వలేదనో, పేరు మారలేదనో క్లెయిమ్‌లు రిజెక్ట్ అవుతుంటాయి. సాధారణ క్లెయిమ్ సెటిల్ అవ్వడానికి కనీసం 7 నుండి 15 రోజుల సమయం పడుతుంది. ఇటీవలి కాలంలో ఈపీఎఫ్‌ఓ కొన్ని మార్పులు చేసింది. ‘ఆటో సెటిల్‌మెంట్‌’ కింద అప్లై చేసుకుంటే, ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా కంప్యూటర్ సాఫ్ట్‌వేరే 3 రోజుల్లో రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లను ఆమోదిస్తోంది. అయితే, ఇది కూడా కేవలం అనారోగ్య కారణాలు, విద్య, వివాహం, ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఐసీయూలో చేరిన రోగికి 3 రోజులు అనేది కూడా చాలా పెద్ద సమయం. ఆ సమయంలో చేతిలో డబ్బులు లేక ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ‘పేపర్‌లెస్, ఇన్‌స్టంట్ విత్‌డ్రా’ విధానాన్ని తెరపైకి తెచ్చింది. మరో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘పీఎఫ్ ఏటీఎం కార్డు’. అవును, మీరు విన్నది నిజమే! బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డులు ఇచ్చినట్లే.. ఈపీఎఫ్‌ఓ కూడా తన చందాదారులందరికీ ఒక ప్రత్యేక పీఎఫ్ ఏటీఎం కార్డును జారీ చేయనుంది. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈపీఎఫ్‌ఓ ఒక కొత్త చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. మీ దగ్గర ఉన్న పీఎఫ్ ఏటీఎం కార్డును ఉపయోగించి, మీరు దేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా మీ పీఎఫ్ అకౌంట్లోని నగదును నేరుగా డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ ఏటీఎం కార్డు ద్వారా మీ పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి వీలుండదు. కేవలం మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఎందుకంటే పీఎఫ్ అనేది ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించినది. అత్యవసరాల కోసం సగం డబ్బును ఏటీఎం ద్వారా ఎప్పుడైనా తీసుకునేలా, మిగిలిన సగం భవిష్యత్తు కోసం భద్రంగా ఉండేలా ఈ 50% రూల్‌ను పెట్టారు. దీనివల్ల ఎలాంటి కాగితపు పని లేకుండా, కేవలం నిమిషాల్లోనే ఏటీఎం మిషన్ ద్వారా మీ పీఎఫ్ డబ్బులు మీ చేతికి వచ్చేస్తాయి. ఇక డిజిటల్ ప్రియుల కోసం తీసుకొస్తున్న మరో అద్భుతమైన ఫీచర్.. యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్‌డ్రా. కేంద్ర ప్రభుత్వ అధికారిక యాప్ అయిన బీమ్ యాప్‌లో తొలుత ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురానున్నారు. ఆ తర్వాత గూగుల్ పే, ఫోన్ పే వంటి అన్ని ప్రముఖ యూపీఐ యాప్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. నిజానికి ఈ సాంకేతికత ఈ ఏడాది ఏప్రిల్ నుంచే అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, కోట్ల మంది చందాదారుల డేటా భద్రత దృష్ట్యా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. యూపీఐ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లోని గరిష్టంగా 75 శాతాన్ని మీరు సెకన్లలో విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం నిధులను మీ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ కింద ఉంచాల్సి ఉంటుంది. ఈ 25 శాతం నగదును మీరు ఉద్యోగం పూర్తిగా మానేసినప్పుడు లేదా రిటైర్ అయినప్పుడు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడాని వీలవుతుంది. అత్యవసర సమయాల్లో రూ.5 లక్షల వరకు నగదును ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆటో సెటిల్మెంట్ చేసేలా ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మరో అదిరిపోయే తీపి కబురు ఏంటో తెలుసా? వచ్చే నెల నుంచి మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఎలాంటి యాప్స్ ఓపెన్ చేయక్కర్లేదు. మీరు ప్రతిరోజూ వాడే వాట్సాప్ లోనే మీ పీఎఫ్ వివరాలన్నీ తెలిసిపోతాయి! ఈపీఎఫ్‌ఓ, పీఎంవీబీఆర్‌వై కింద లభించే ప్రాథమిక సేవలను చందాదారులకు సులభంగా చేరవేయడానికి వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని నిర్ణయించింది. ఈపీఎఫ్‌ఓ త్వరలోనే ఒక అధికారిక, వెరిఫైడ్ వాట్సాప్ నంబర్‌ను విడుదల చేస్తుంది. చందాదారులు తమ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిన నమోదిత మొబైల్ నంబర్ నుండి ఆ నంబర్‌కు ‘hello’ అని ఒక చిన్న మెసేజ్ పంపితే చాలు. వెంటనే మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. సేవలు కేవలం ఇంగ్లీషులోనే కాదు, మన తెలుగుతో పాటు స్థానిక భాషల్లోనూ అందుబాటులో ఉంటాయి. కేవలం ఒక క్లిక్‌తో మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మీ అకౌంట్ నుంచి జరిగిన చివరి 5 లావాదేవీల వివరాలను కూడా మీరు వాట్సాప్ లోనే చూసుకోవచ్చు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ వాడకం అంతగా తెలియని సాధారణ కార్మికులు కూడా తమ పీఎఫ్ అకౌంట్‌ను సులభంగా ట్రాక్ చేయగలుగుతారు. చూశారుగా! సాంకేతికతను ఉపయోగించుకుని ఈపీఎఫ్‌ఓ తన 7 కోట్ల మంది చందాదారుల జీవితాలను ఎంత సులభతరం చేయబోతుందో! ఒకప్పుడు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ, దళారుల చుట్టూ తిరిగిన రోజుల నుంచి.. ఈరోజు నేరుగా చేతిలోని మొబైల్‌తో యూపీఐ పిన్ కొట్టి, లేదా ఏటీఎం కార్డు పెట్టి నిమిషాల్లో పీఎఫ్ డబ్బులు తీసుకునేలా ప్రభుత్వం కృషి చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూన్ 8న ‘చేప ప్రసాదం’ ఈ ఏడాది రాత్రివేళ పంపిణీ

యువకుడికి అరగుండు, చెప్పుల దండతో ఊరేగింపు.. కారణం ఇదే

మీ టూ వీలర్‌ పోయిందా.. ఇక్కడుందేమో చూసుకోండి

టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు

మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు

Follow Us