మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

రోనా లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా అన్ని పనులూ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. పెళ్లిళ్లు చేసుకునే వారికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కరోనా ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా? అని కొన్ని జంటలు..

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 1:55 PM

కరోనా లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా అన్ని పనులూ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి.. పెళ్లిళ్లు చేసుకునే వారికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోందీ లాక్‌డౌన్. కరోనా ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా? అని కొన్ని జంటలు ఎదురుచూస్తున్నాయి. మే 3 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే పెళ్లిళ్లు చేసుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

మే 3వ తేదీ తర్వాత పెళ్లి చేసుకునే వారికి అధికారిక అనుమతి తప్పనిసరి చేసింది. అందులోనూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో పలు రూల్స్ జారీ చేసింది ప్రభుత్వం. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరుపున కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంది. అలాగే ఖచ్చితంగా వారి వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలి. కాగా అందులోనూ విజయనగరం జిల్లా ఇంతవరకూ గ్రీన్‌ జోన్‌లో ఉన్నందున ఇతర జిల్లాలకు చెందిన వారితో సంబంధాలు కుదుర్చుకున్న పెళ్లిళ్లకు అనుమతులను నిరాకరిస్తున్నట్లు డీఆర్‌వో వెంకటరావు తెలిపారు.

Read More: తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ