కరోనాను జయించిన దేశం..దశల వారిగా లాక్డౌన్ ఎత్తివేత
కరోనా కోరల్లో పడి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. తాజాగా ఓ దేశం మాత్రం కోవిడ్ భూతాన్ని అదుపుచేయటంలో విజయం సాధించింది. కరోనా మహమ్మారి నుంచి న్యూజిల్యాండ్ దాదాపు బయటపడింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తాము విజయం సాధించామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ నెల 27నే ప్రకటించారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేస్తామని ఆమె పేర్కొన్నారు. న్యూజిల్యాండ్లో అయిదు వారాల పాటు కఠిన లాక్డౌన్ అమలు చేశారు. సోమవారంతో గడువు ముగిసింది. ఆధునిక చరిత్రలోనే ఇంత తీవ్రంగా […]

కరోనా కోరల్లో పడి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. తాజాగా ఓ దేశం మాత్రం కోవిడ్ భూతాన్ని అదుపుచేయటంలో విజయం సాధించింది. కరోనా మహమ్మారి నుంచి న్యూజిల్యాండ్ దాదాపు బయటపడింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తాము విజయం సాధించామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ నెల 27నే ప్రకటించారు. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేస్తామని ఆమె పేర్కొన్నారు.
న్యూజిల్యాండ్లో అయిదు వారాల పాటు కఠిన లాక్డౌన్ అమలు చేశారు. సోమవారంతో గడువు ముగిసింది. ఆధునిక చరిత్రలోనే ఇంత తీవ్రంగా ఏ దేశంలోనూ ఇంత కఠినంగా లాక్డౌన్ అమలు చేయలేదని ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ వ్యాఖ్యానించారు. మంగళవారం నుంచి దేశంలో లాక్డౌన్ నిబంధనలను సడలించారు. దీంతో లక్షలాది మంది తిరిగి విధుల్లో చేరిపోయారు. 75 శాతం ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు ఒక్కరోజులోనే ఊపందుకున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం ఒక్కటంటే ఒకే కేసు రెండు రోజుల క్రితం నవెూదయింది. అది కూడా ఏవిధంగా సోకిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. జనం మద్దతుతోనే ఇదంతా సాధ్యమయిందని, ఇక ఆర్థిక వృద్ధిని తిరిగి సాధారణ స్థితికి తెస్తామని ప్రధాని జసిందా ధీమాగా చెప్పారు. అయితే, కరోనాను అధిగమించామని సంబరాలు చేసుకోవడానికి ఇది సమయం కాదని జసిందా పేర్కొన్నారు.