AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మళ్లీ సెంచరీ దాటిన కరోనా కేసులు..

ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ సెంచరీ దాటాయి. గత కొద్దిరోజుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో సడలింపులు తీసుకురావడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు...

ఏపీలో మళ్లీ సెంచరీ దాటిన కరోనా కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 2:03 PM

Share

ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ సెంచరీ దాటాయి. గత కొద్దిరోజుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో సడలింపులు తీసుకురావడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు మూడు వేలకి పైగా దాటాయి. తాజాగా 130 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,718కి చేరింది. అలాగే ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఖ్య ఇప్పటి వరకూ 75 మంది మరణించారు. ఇక కోవిడ్‌ నుంచి 2,353 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1290 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

కాగా ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా భారత్‌లో 9971 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,46,628కి చేరింది. అలాగే 24 గంటల్లో 287 మంది చనిపోయారు. ఇంత భారీగా చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6929కి చేరింది. తాజాగా శనివారం 4611 మంది రికవరీ అవ్వడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,19,292గా ఉంది. ప్రస్తుత దేశంలో 1,20,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

విషాదం.. కరోనా వైరస్‌తో జర్నలిస్ట్ మృతి

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు