Coronavirus Pfizer vaccine: నార్వేలో టీకా తీసుకున్న వృద్ధులు మృతి, ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా

నార్వే దేశంలో కొవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. టీకా మరణాలతో 10 మిలియన్ల ఫైజర్ వ్యాక్సిన్‌ డోస్ లకు ఒప్పందం కుదుర్చుకున్న..

Coronavirus Pfizer vaccine: నార్వేలో టీకా తీసుకున్న వృద్ధులు మృతి, ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా
Follow us

|

Updated on: Jan 18, 2021 | 4:24 PM

Coronavirus Pfizer vaccine: నార్వే దేశంలో కొవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. టీకా మరణాలతో 10 మిలియన్ల ఫైజర్ వ్యాక్సిన్‌ డోస్ లకు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్ట్రేలియాలో ఆందోళన నెలకొంది. టీకా విషయంపై ఆస్ట్రేలియా అధికారులు.. నార్వే ప్రభుత్వాన్ని అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని కోరుతున్నారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ మెల్‌బోర్న్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ను తయారు చేసిన కంపెనీతో పాటు నార్వేజియన్ మెడికల్ రెగ్యులేటర్ నుంచి ఫైజర్ వ్యాక్సిన్‌ పై అదనపు సమాచారాన్ని కోరుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ నార్వే ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టిందని తెలిపారు.

నార్వే దేశంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్తితులు టీకాలు ఆరోగ్యవంతులకు, యువకులకు వేయకుండా ఉండాలని అర్ధంకాదని.. ఈ సంఘటనను ఒక అనుభవంగా తీసుకోవాలని సూచించారు. అయితే వ్యాక్సినేషన్ ఇచ్చే ముందు భద్రతా పర్యవేక్షణ ఎంత అవసరమో తెలియజేస్తుందని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కొత్త అధ్యక్షుడు ఎమెర్ కుక్ స్పందిస్తూ.. కోవిడ్ నివారణకు టీకా వేసే సమయంలో భద్రత ఎంతముఖ్యమో తెలియజేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఎ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ఒక ఛాలెంజ్ అని చెప్పారు.

నార్వే దేశంలో రెండు రోజుల క్రితం కరోనా టీకాలు వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. కరోనా టీకాలు వేయించుకున్న 23 మంది అనారోగ్యానికి గురై మరణించడంతో నార్వే అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.80 ఏళ్ల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తే వారిలో ప్రతికూల చర్యలు కనిపించాయని వైద్యులు చెప్పారు. 23 మంది వృద్ధులు కరోనా టీకా వేయించుకున్న కొద్దిసేపటికే మరణించారని, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ వల్లనే మరణాలు సంభవించాయని ఇంకా తేలలేదని, మరణించిన 23 మందిలో 13 మంది విరేచనాలు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. మరోవైపు నార్వేలో టీకా మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా తగ్గించారు.

Also Read: ఎలక్షన్స్ ప్రకటించకుండానే హీట్ ఎక్కుతున్న పశ్చిమబెంగాల్, త్వరలో కోల్‌కతాలో కలుద్దామన్న శివసేన