Reaching Kolkata Soon:ఎలక్షన్స్ తేదీ ప్రకటించకుండానే హీట్ ఎక్కుతున్న పశ్చిమబెంగాల్, త్వరలో కోల్కతాలో కలుద్దామన్న శివసేన
శ్చిమ బెంగాల్ లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తాము దిగనున్నామని శివసేన ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత. ఎంపీ సంజయ్ రౌత్..
Reaching Kolkata Soon : పశ్చిమ బెంగాల్ లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తాము దిగనున్నామని శివసేన ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత. ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎప్పటి నుంచో ఈ ఎన్నికల పోటీపై అధ్యక్షుడి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కనుక ఉద్దవ్ థాక్రేతో చర్చించిన అనంతరం.. పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల బరిలో తాము దిగనున్నామని స్పష్టం చేశారు. త్వరలో కోల్ కతాలో కలుద్దామంటూ జై హింద్ అని ట్వీట్ చేశారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో తాజా రాజకీయాలతో హాట్ హాట్ గా ఉంది. గత పదేళ్లుగా సీఎం గా ఉన్న మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుకుంటున్నారు. మరో వైపు ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. పెద్ద ఎత్తున వ్యూహ రచనలు చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన తాము కూడా ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించి సంచలనం సృష్టించింది.
So, here is the much awaited update.
After discussions with Party Chief Shri Uddhav Thackeray, Shivsena has decided to contest the West Bengal Assembly Elections.
We are reaching Kolkata soon…!!
Jai Hind, জয় বাংলা !
— Sanjay Raut (@rautsanjay61) January 17, 2021
Also Read: ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా..