AP Corona Cases: ఏపీలో మరోసారి కలవరం.. పెరిగిన పాజిటివ్ కేసులు.. వైరస్ బారినపడి 10మంది మృతి

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 67,716 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా1,501 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

AP Corona Cases: ఏపీలో మరోసారి కలవరం.. పెరిగిన పాజిటివ్ కేసులు.. వైరస్ బారినపడి 10మంది మృతి
Follow us

|

Updated on: Aug 19, 2021 | 5:45 PM

AP Covid 19 Cases Today: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 67,716 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా1,501 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 19,98,603 కు చేరింది. ఇక, నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి మరో 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 13,696 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,697 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 69 వేల 169 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,738 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,59,03,366 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

ఇక, వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…