- Telugu News Photo Gallery Technology photos MI Releasing Notebook Series On August 26th According To Amazon These Are The Features
MI Notebook: ఇకపై మార్కెట్లో సందడి చేయనున్న ఎమ్ఐ నోట్బుక్స్… ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
MI Notebook: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎంఐ తాజాగా నోట్బుక్స్ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థులను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ నోట్బుక్కు సంబంధించి ఆగస్టు 26న అధికారిక ప్రకటన చేయనుంది...
Updated on: Aug 19, 2021 | 5:15 PM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ స్మార్ట్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లతో మార్కెట్ను శాషిస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు దాదాపు అన్ని రకాల గ్యాడ్జెట్లను విడుదల చేసిన ఈ కంపెనీ తాజాగా నోట్ బుక్స్ను కూడా తీసుకొచ్చే వనిలో పడింది. ఎంఐ నోట్బుక్స్ సిరీస్ను భారత్లో లాంచ్ చేయనుంది.

ఈ నోట్బుక్ను ఎంఐ ఆగస్టు 26న అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ ఈ నోట్బుక్ ఫీచర్ల గురించి కొన్ని లీక్లు ఇచ్చింది.

వాటి ప్రకారం.. ఎంఐ నోట్బుక్ 16:10 సైజ్ డిస్ప్లేతో రానుంది. ఇక ఎంఐ ఈ నోట్బుక్స్లో డిస్ప్లేకు ప్రాధాన్యత ఇవ్వనుంది. 3020X2000 రిసొల్యూషన్తో వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా సెక్యూరిటీ ప్రాయారిటీ ఇస్తూ.. ఫింగర్ప్రింట్ సెన్సార్ను ఎంబేడ్ చేసిన పవర్బటన్తోపాటు బ్యాక్లిట్ కీబోర్డ్ ఫీచర్తో రానుంది.

ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎమ్ ఈ నోట్బుక్ను మ్యాక్బుక్ డిజైన్ మాదిరిగా డిజైన్ చేయనుందని సమాచారం.




