AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 3 Result Date: మరింత ఆలస్యం కానున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాలు.. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్స్ పోస్టులకు నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 3 పరీక్షలు పూర్తికాగా.. ఈ నెలలో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. అయితే ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న గ్రూప్ 3 అభ్యర్ధులకు మాత్రం సుదీర్ఘ నిరీక్షణ తప్పేలా లేదు.. ఎందుకంటే..

TGPSC Group 3 Result Date: మరింత ఆలస్యం కానున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాలు.. కారణం ఇదే
TGPSC Group 3 Result Date
Srilakshmi C
|

Updated on: Dec 09, 2024 | 3:37 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్‌ పరీక్షల ఫలితాలు, పోస్టుల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమం నిర్వహించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తొలుత గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిపారు. ఆ తర్వాత గ్రూప్‌-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో జరిగాయి. గ్రూప్‌ 2 పరీక్షలు డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల మాదిరిగాకాకుండా ఫలితాలను మాత్రం రివర్స్ విధానంలో విడుదల చేసేందుకు కమిషన్‌ సిద్ధం అవుతుంది. అంటే తొలుత గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల చేసి, అందులోని పోస్టులన్నీ భర్తీ చేశాక.. గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల చేసి.. ఆ పోస్టులు కూడా పూర్తిగా భర్తీ చేపట్టాలని భావిస్తుంది. ఆ తర్వాతే గ్రూప్‌ 3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది.

బ్యాక్‌లాక్‌లకు చెక్‌ పెట్టేందుకే ఈ విధానాన్ని అనుసరించనున్నట్లు టీజీపీఎస్సీ చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రీలింక్విష్‌మెంట్‌ విధానం అమల్లో లేనందున, మెరిట్‌ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఉన్నత కేటగిరీ పోస్టుల తరువాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టాలని. తద్వారా బ్యాక్‌లాగ్‌ను నివారించవచ్చని కమిషన్‌ భావిస్తోంది.

ఇప్పటికే గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరిలోగా వీటి ఫలితాలు ప్రకటించాలని, అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి, తుది ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మార్చి నాటికి గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ ముగించి, వెనువెంటనే గ్రూప్‌ 2 ఫలితాలు ప్రకటించాలని భావిస్తుంది. ఆ తర్వాతే గ్రూప్‌ 3 ఫలితాలు రానున్నాయి. గ్రూప్‌ 3లో 1388 పోస్టుల భర్తీ కోసం మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి గ్రూప్స్‌ 1, 2, 3 పోస్టుల నియామకాలన్నీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దళారుల మాయమాటలకు మోసపోవద్దని, ఎవరైనా దళారులు అభ్యర్థులను సంప్రదిస్తే విజిలెన్స్‌ సెల్‌ నంబరు 99667 00339కు సమాచారం ఇవ్వాలని లేదంటే vigilance@tspsc.gov.in ఈ-మెయిల్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్