TS Polytechnic: తెలంగాణ పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌.. ఆందోళనలో విద్యార్థులు..

TS Polytechnic: తెలంగాణలో పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయిన సంఘటన షాక్‌కి గురి చేసింది. ఫిబ్రవరి 8న మొదలైన పాలిటెక్నిక్‌ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు బోర్డు గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో ఉన్న..

TS Polytechnic: తెలంగాణ పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌.. ఆందోళనలో విద్యార్థులు..
Paper Leak
Follow us

|

Updated on: Feb 11, 2022 | 3:07 PM

TS Polytechnic: తెలంగాణలో పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయిన సంఘటన షాక్‌కి గురి చేసింది. ఫిబ్రవరి 8న మొదలైన పాలిటెక్నిక్‌ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు బోర్డు గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో ఉన్న స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ అయినట్లు బోర్డుకు సమాచారం అందింది. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన ఇతర జిల్లాల్లోని ప్రిన్సిపల్స్‌ బోర్డుకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది.

ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి బోర్డు సెక్రెటరీ కాలేజీపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజీపై కేసు నమోదు చేశారు. ప్రశ్నాపత్రాలను ఎవరు లీక్‌ చేశారు.? కాలేజీ యాజమాన్యమే ఇందుకు ప్రోత్సహించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రాల లీక్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలను కొనసాగిస్తారా.? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌కి 14పైసల ఖర్చు మాత్రమే..?

Chanakya Niti: ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి ఈ లక్షణాలు కలిగి ఉండాలంటున్న చాణక్యుడు..

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..