JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

జేఈఈ మెయిన్‌ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదలచేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..
Jee Main Result
Follow us

|

Updated on: Jul 11, 2022 | 9:53 AM

JEE Main Result 2022: తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఈఈ మెయిన్‌ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదలచేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. రాష్ట్రానికి చెందిన యశ్వంత్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీ. ఆదినారాయణ, కే.సుహాస్‌, కే.ధీరజ్‌, అనికేత్‌ చటోపాధ్యాయ, రూపేశ్‌ వంద పర్సంటైల్‌ సాధించారు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్‌ కీని విడుదల చేసింది. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉన్నది. ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్ & ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి