AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Sector in India: 2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి వెల్లడి

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగం వచ్చ ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు 8వ క్యాటలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సస్టెయినబిలిటీ ఆఫ్‌ ఈవీ వెహికల్‌ ఇండస్ట్రీ- ఈవీఎక్స్‌పో 2024 సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు..

EV Sector in India: 2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి వెల్లడి
EV Sector
Srilakshmi C
|

Updated on: Dec 20, 2024 | 3:55 PM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం (డిసెంబరు 19) వెల్లడించారు. ఉద్యోగాల కల్పన కూడా ఎన్నో రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాయి. మొత్తం వాహన విక్రయాలలో సింగిల్ డిజిట్ మార్కెట్ వాటాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 18 లక్షలకు పైగా EVలు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఇది మొత్తం వాహనాల అమ్మకాలలో 10 శాతం కంటే చాలా తక్కువ.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాయి, మొత్తం వాహన విక్రయాలలో సింగిల్ డిజిట్ మార్కెట్ వాటాతో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య 18 లక్షలకు పైగా EVలు రిజిస్టర్ అయ్యాయి, విభాగాల్లో మొత్తం వాహనాల అమ్మకాలలో 10 శాతం కంటే తక్కువ. కానీ 2030 నాటికి పరిస్థితి పూర్తిగా మారుతుందని మంత్రి అన్నారు. ఈవీ పర్యావరణ వ్యవస్థలో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. ప్రస్తుతం రూ.4.50 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ ఐదు రెట్టు పెరిగి 2023 నాటికి రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌కు చేరుకుంటుందని, భవిష్యత్తులో భారత్ గ్లోబల్ ఈవీ హబ్‌గా మారాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈవీల ఫైనాన్స్‌ మార్కెట్‌ పరిమాణం కూడా రూ.4 లక్షల కోట్లకు చేరొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం ‘8వ క్యాటలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సస్టెయినబిలిటీ ఆఫ్‌ ఈవీ వెహికల్‌ ఇండస్ట్రీ- ఈవీఎక్స్‌పో 2024’ సమావేశంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. రవాణా రంగం నుంచే 40 శాతం వాయు కాలుష్యం నమోదవుతోందని, అలాగే శిలాజ ఇంధనాల దిగుమతులు రూ.22 లక్షల కోట్ల స్థాయికి చేరినట్లు తెలిపారు. ఇది అతి పెద్ద ఆర్థిక సవాలుగా ఇది మారిందని వివరించారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనంపై అధికంగా దృష్టి సారిస్తోందని, మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌర విద్యుత్‌ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జల విద్యుత్, సౌర విద్యుత్, హరిత విద్యుత్‌ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us