AP TET 2022: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరికాసేపట్లో టెట్-2022 నోటిఫికేషన్..
AP TET 2022: ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఏపీ టెట్ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేయనున్నారు. మరికాసేపట్లో ఈ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు...
AP TET 2022: ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఏపీ టెట్ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేయనున్నారు. మరికాసేపట్లో ఈ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి టెట్కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. టెట్ ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ను http://aptet.apcfss.in ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్, సిలబస్, పరీక్ష తేదీలు, పరీక్ష ఫీజు, ఆన్లైన్ పరీక్ష సూచనలు వెబ్సైట్ https://aptet.apcfss.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఏపీలో డీఎస్సీ వేయక చాలా రోజులవుతోంది. దాదాపు మూడేళ్ల నుంచి టెట్ నిర్వహించకపోవడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ కల్పించనున్నారు. అలాగే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అర్హత సాధించినవారు కూడా మళ్లీ పరీక్ష రాయనున్నారు. ఇక టెట్ అర్హత సర్టిఫికెట్కు గతంలో ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు ఉండగా, తాజాగా జీవితకాలం చెల్లుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..