AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Exam Date: బాబోయ్.. ఏపీ టెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు! ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్‌ పరీక్షకు ఏకంగా 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు..

AP TET 2024 Exam Date: బాబోయ్.. ఏపీ టెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు! ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా?
AP TET 2024 Exam
Srilakshmi C
|

Updated on: Aug 06, 2024 | 6:28 AM

Share

అమరావతి, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్‌ పరీక్షకు ఏకంగా 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు దరఖాస్తుల వివరాలను వెల్లడించింది. సోషల్‌ స్టడీస్‌ పేపర్‌కు సంబంధించి 70,767 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 2- బి విభాగంలో 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈసారి మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో పోటీపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని.. పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి త్వరలో విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి ఈ ఏడాది జులై 2వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అలాగే పరీక్షల సన్నద్ధతకు కూడా మరింత సమయం ఇచ్చింది. దాదాపు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ మేరకు టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ తేదీలను అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు. టెట్ హాల్‌ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా