AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ..

AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. మరో రెండు వారాల్లో హాల్‌టికెట్లు విడుదల!
AP TET 2024 Hall Tickets
Srilakshmi C
|

Updated on: Sep 09, 2024 | 6:39 AM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 9: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 22వ తేదీ తర్వాత నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అక్టోబర్‌ 4వ తేదీన తొలి రోజు పరీక్ష తర్వాత మరుసటి రోజు నుంచి ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27న తుది ఆన్సర్ ‘కీ’ విడుదల అవుతుంది. నవంబర్‌ 2వ తేదీన ఫలితాల ప్రకటన ఉంటుంది. ఓసీ(జనరల్‌) కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు 60 శాతం మార్కులు ఆపైన‌ వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక బీసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులకుపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు 40 శాతం మార్కులకుపైన‌ మార్కులు వస్తే ఉత్తీర్ణత అయినట్లు అవుతుంది. కాగా ఈసారి మొత్తం 4,27,300 మంది అభ్యర్ధులు టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

టెట్‌ పరీక్ష విధానం..

టెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలకు జరుగుతుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శిశువికాసం, అధ్యాపన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 2 నుంచి 30 ప్రశ్నలు, మెయిన్‌ సబ్జెక్ట్‌ నుంచి 60 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలే అడుగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అర్ధరాత్రి ఆస్పత్రికి మాస్క్‌‌తో తచ్చాడిన ఓ మహిళ.. ఎవరా అని..
అర్ధరాత్రి ఆస్పత్రికి మాస్క్‌‌తో తచ్చాడిన ఓ మహిళ.. ఎవరా అని..
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా