AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బస్సుల్లేక ‘టెన్త్‌’ విద్యార్ధుల అగచాట్లు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని

సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. సరైన బస్సు సౌకర్యం లేని దూర ప్రాంతాల నుంచి రాలేక విద్యార్థులు తంటాలు పడుతున్నారు. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో ఆటోలో సుమారు 15 మందికి పైగా ప్రయాణిస్తున్నారు..

Andhra Pradesh: బస్సుల్లేక 'టెన్త్‌' విద్యార్ధుల అగచాట్లు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
SSC Students
Srilakshmi C
|

Updated on: Mar 19, 2024 | 9:33 AM

Share

దేవరాపల్లి, మార్చి 19: సోమవారం నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. సరైన బస్సు సౌకర్యం లేని దూర ప్రాంతాల నుంచి రాలేక విద్యార్థులు తంటాలు పడుతున్నారు. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో ఆటోలో సుమారు 15 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన ఆటోల్లో బాలికలు సైతం వెనుక భాగంలో కూర్చుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు స్పందించి కనీసం పరీక్ష సమయంలోలైన బస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

కాగా మార్చి 18న జరిగిన పదో తరగతి తొలి పరీక్షకు ఓ విద్యార్ధిని నానా కష్టాలు పడింది. దేవరాపల్లి మండలం తెనుగుపూడి కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా.. ఓ విద్యార్థిని పొరబాటున దేవరాపల్లి కేంద్రానికి వెళ్లింది. దీంతో అక్కడే ఉన్న ఎస్సై నాగేంద్ర వెంటనే స్పందించి.. తెనుగుపూడి కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా మహిళా కానిస్టేబుల్‌ చంద్రకళతో ఆ విద్యార్థినిని స్కూటీపై పరీక్ష కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లారు. దీంతో అంతా ఊపిరి తీసుకున్నారు.

అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరైన మహిళామణి

చదువుకోవాలనే కోరిక ఉండాలే కాని అందుకు వయసు అడ్డుకాదని మరోమారు నిరూపితమైంది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి వయసు 53 ఏళ్లు. ఈ వయసులోనూ చదువుకోవాలనే తపన ఆమెను పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేలా చేసింది. దీంతో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి సార్వత్రిక పరీక్ష రాసేందుకు ఆమె భద్రగిరి ఏపీఆర్‌ కేంద్రానికి వచ్చారు. చిన్న తనంలో పలు కారణాల వల్ల చదువుకోలేకపోయానని, ఏడో తరగతిలో చదువు మానేశానని చెప్పుకొచ్చారు. ఆసక్తి ఉండటంతో ఇన్నాళ్లకు మళ్లీ పరీక్షలు రాసే అవకాశం దక్కిందని పెద్దమ్మి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్