AP 10th Class Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు.. సత్తా చాటిన ‘గురుకుల’ విద్యార్ధులు!
ఏపీ ఎస్సెస్సీ డైరెక్టర్ దేవానంద రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. 6,16,615 మంది పరీక్షలకు హాజరవగా వీరిలో మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత పొందారు. అంటే 5,34,574 మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. 4.85 శాతం బాలికలు బాలురు కంటే అధికంగా ఉత్తీర్ణత పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,645 పాఠశాలల..
అమరావతి, ఏప్రిల్ 22: ఏపీ ఎస్సెస్సీ డైరెక్టర్ దేవానంద రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. 6,16,615 మంది పరీక్షలకు హాజరవగా వీరిలో మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత పొందారు. అంటే 5,34,574 మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. 4.85 శాతం బాలికలు బాలురు కంటే అధికంగా ఉత్తీర్ణత పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2803 స్కూల్స్లో 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 స్కూల్స్లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.
96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్
పార్వతీపురం మన్యం జిల్లాలో 96.37 శాతంతో అత్యంధిక శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సత్తా చాటిన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్ధులు.. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 98.43 శాతంతో అధికంగా ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలో మొత్తం 12 రకాల మేనేజ్మెంట్లు ఉంటే వీరిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత పొందారు.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.