AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Prices: సామాన్యులకు షాక్‌.. మళ్లీ గోధుమ ధరలు పెరగనున్నాయా..?

ఈ రోజుల్లో ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉంది. కొన్ని దేశాలు దేశాలు కరోనా మహమ్మారి, అధిక ఇంధన ధరలతో ఇబ్బంది పడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా..

Wheat Prices: సామాన్యులకు షాక్‌.. మళ్లీ గోధుమ ధరలు పెరగనున్నాయా..?
Wheat
Subhash Goud
|

Updated on: Dec 05, 2022 | 11:49 AM

Share

ఈ రోజుల్లో ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉంది. కొన్ని దేశాలు దేశాలు కరోనా మహమ్మారి, అధిక ఇంధన ధరలతో ఇబ్బంది పడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోధుమలు, ఇతర వస్తువులపై ప్రభావం పడింది. దీని కారణంగా గోధుమల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్త మార్కెట్లు, కొత్త ఆర్థిక వ్యవస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ రోజుల్లో గందరగోళంలో ఉంది. ఇది ప్రపంచ సరఫరాలో అంతరాయం కలిగించింది. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్నాయని, ఆహార భద్రత ప్రమాదంలో పడిందని నివేదికలు చెబుతున్నాయి. దీని వల్ల దేశంలో గోధుమల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గోధుమల ధరలు పెరిగితే ప్రజల ఇంటి బడ్జెట్ మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడ్డాయి.

మార్చిలో అకస్మాత్తుగా ధరలు పెరగడం, ప్రభుత్వం వద్ద ధాన్యం నిల్వలు తక్కువగా ఉండటం, ప్రపంచ డిమాండ్ పెరగడం వంటి కారణాలతో గోధుమ ఉత్పత్తి తక్కువ కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో పిండి ధర పెరిగే అవకాశం ఉందని గోధుమ ప్రాసెసింగ్ పరిశ్రమ ఆందోళన చెందుతోంది. పిండిని వినియోగించే ప్రధాన దేశాల్లో దీని ధర వేగంగా పెరగడమే దీని వెనుక కారణం.

దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో గోధుమల ధరలు రూ.27 నుంచి రూ.29.50 వరకు ఉన్నాయని, ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.20.15 కంటే చాలా ఎక్కువని వ్యాపారులు, ప్రాసెసర్లు చెబుతున్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా గోధుమలు పంపిణీ చేస్తున్న చోట దిగువ మధ్యతరగతి ప్రజలను ఈ ద్రవ్యోల్బణం నుండి రక్షించడానికి ఎటువంటి ప్రయోజనం లేదు. నివేదికల ప్రకారం.. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గోధుమ ధర, ఎంఎస్‌పీ కంటే 30 నుండి 40 శాతం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత 4 నెలల్లో కిలో ధర రూ.24 నుంచి రూ.29కి పెరిగింది.

ఇవి కూడా చదవండి

చర్యలు చేపట్టిన ప్రభుత్వం:

ధరల నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు గాను గోధుమ పిండి ఎగుమతులపై పూర్తి నిషేధం విధించాలని ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయించింది. గోధుమ పిండి, మైదా, సెమోలినా ఎగుమతులపై ప్రభుత్వం షరతులు విధించినట్లు జూలైలో డిజిఎఫ్‌టి నోటిఫికేషన్‌లో పేర్కొంది. విదేశాల్లో పెరిగిన డిమాండ్ కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్-జూలై 2022లో భారతదేశం నుండి గోధుమ పిండి ఎగుమతులు 200 శాతం పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు ఆకాశాన్ని తాకాయి.

ఈ సీజన్‌లో గోధుమల విత్తనం పెరిగింది

గోధుమల ధర పెరగడంతో రైతులు విత్తనం పెంచారు. రానున్న నెలల్లో వాతావరణం అనుకూలిస్తే పంటలు బాగా పండుతాయని వ్యాపారులు చెబుతున్నారు. నవంబర్ 25 వరకు 15.2 మిలియన్ హెక్టార్లలో గోధుమలు సాగయ్యాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో సాగు విస్తీర్ణం కంటే 10.48 శాతం ఎక్కువ. దేశంలో దాదాపు 3.05 కోట్ల హెక్టార్లలో గోధుమలు సాగవుతున్నాయని నివేదికలు వెల్లడవుతున్నాయి.

ప్రభుత్వం గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బహిరంగ మార్కెట్‌లో గోధుమలను విక్రయించే యోచన లేదని కూడా చెప్పినప్పటికీ, గోధుమల కోసం బహిరంగ మార్కెట్‌లో విక్రయించడాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా దిగుమతి సుంకాన్ని తగ్గించాలా అనే దానిపై కాలక్రమేణా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.

పేదలకు ఉచితంగా గోధుమలు

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు ఉచితంగా గోధుమలను అందిస్తోంది. ఈ పథకాన్ని డిసెంబర్ 2022 తర్వాత పొడిగించింది. పీఎంజీకేఏవై కింద జాతీయ ఆహార భద్రతా చట్టంలోని 80 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 5 కిలోల గోధుమలు, బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది. ఇది కాకుండా ఈ లబ్ధిదారులకు ప్రభుత్వ కోటా నుండి తక్కువ ధరకు రేషన్ కూడా లభిస్తుంది. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో ప్రారంభించిన పీఎంజీకేఏవై.. అప్పటి నుండి 7 సార్లు పొడిగించబడింది. చివరిసారిగా దీని కాలవ్యవధిని సెప్టెంబర్ 2022లో పొడిగించారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి