AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: 50 ఏళ్ల కిందట వెండి ధర ఎంత ఉందో తెలుసా? వామ్మో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెరిగిందా?

Silver Price: బంగారం, వెండి ఒక అద్భుతమైన పెట్టుబడి ఎంపికలు. ఇప్పుడు ప్రజలు వెండిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ ఇప్పుడు అందరూ వెండి కొనడం సాధ్యం కాదు. ఒక కిలో వెండికి లక్ష రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఒక సంవత్సరం నుండి వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, గత 50 ఏళ్లలో వెండి ధర చాలా హెచ్చుతగ్గులను చూసింది..

Silver Price: 50 ఏళ్ల కిందట వెండి ధర ఎంత ఉందో తెలుసా? వామ్మో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెరిగిందా?
Subhash Goud
|

Updated on: Mar 20, 2025 | 4:00 PM

Share

ఇప్పుడు బంగారం పెరుగుతున్నట్లే వెండి కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష రూపాయలకుపైనే దాటేసింది. బంగారం ఖరీదైనదే, కానీ ఇప్పుడు వెండి ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. వెండి ధర కిలోకు రూ.100,000 దాటింది. బంగారం ధర కూడా 10 గ్రాములకు దాదాపు 90,000 రూపాయలకు చేరుకుంది. కానీ రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కానీ వెండి ధరలు పెరిగిన వేగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది మాత్రమే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా వెండి ధరలు ఆగవు. ఎందుకంటే ప్రపంచ డిమాండ్ పెరుగుతుంది. ఆభరణాలే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి చాలా అవసరం.

ఇప్పుడు వెండి ధరలో భారీ పెరుగుదల

బంగారం, వెండి ఒక అద్భుతమైన పెట్టుబడి ఎంపికలు. ఇప్పుడు ప్రజలు వెండిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ ఇప్పుడు అందరూ వెండి కొనడం సాధ్యం కాదు. ఒక కిలో వెండికి లక్ష రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. గత ఒక సంవత్సరం నుండి వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, గత 50 ఏళ్లలో వెండి ధర చాలా హెచ్చుతగ్గులను చూసింది. 1975 సంవత్సరంలో వెండి సగటు ధర కిలోకు రూ. 2000-2500 వరకు మాత్రమే ఉండేది. ఆ సమయంలో ప్రపంచ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు US$4-5 వరకు ఉండేది.

19 మార్చి 2025 నాటికి, భారతదేశంలో వెండి ధర కిలోకు దాదాపు లక్ష రూపాయలకుపైగా ఉంది. గత 50 సంవత్సరాలలో వెండి ధర నామమాత్రంగా దాదాపు 40-50 రెట్లు పెరిగింది. అయితే గత 50 సంవత్సరాలలో భారతదేశంలో సగటు ద్రవ్యోల్బణ రేటు సంవత్సరానికి 7-8% ఉంది.

ఇవి కూడా చదవండి

☛ 2000 సంవత్సరంలో భారతదేశంలో వెండి సగటు ధర కిలోకు రూ. 5500 నుండి రూ. 6000 వరకు ఉండేది.

☛ 2001: రూ. 6,000 – రూ. 6,500/కిలో..

☛ 2002: రూ. 6,500 – రూ. 7,000

☛ 2003: రూ. 7,000 – రూ. 7,500

☛ 2004: రూ. 8,000 – రూ. 9,000

☛ 2005: రూ. 9,500 – రూ. 10,500

☛ 2006: రూ. 12,000 – రూ. 14,000

☛ 2007: రూ. 14,000 – రూ. 16,000

☛ 2008: రూ. 18,000 – రూ. 20,000

☛ 2009: రూ. 22,000 – రూ. 24,000

☛ 2010: రూ. 27,000 – రూ. 30,000

☛ 2011: రూ. 50,000 – రూ. 55,000 (ఈ ఏడాదిలో వెండి ధరల్లో తీవ్ర పెరుగుదల)

☛ 2012: రూ. 55,000 – రూ. 58,000

☛ 2013: రూ. 45,000 – రూ. 50,000

☛ 2014: రూ. 40,000 – రూ. 43,000

☛ 2015: రూ. 35,000 – రూ. 38,000

☛ 2016: రూ. 40,000 – రూ. 42,000

☛ 2017: రూ. 38,000 – రూ. 40,000

☛ 2018: రూ. 38,000 – రూ. 40,000

☛ 2019: రూ. 45,000 – రూ. 48,000

☛ 2020: రూ. 60,000 – రూ. 65,000

☛ 2021: రూ. 65,000 – రూ. 70,000

☛ 2022: రూ. 60,000 – రూ. 65,000

☛ 2023: రూ. 70,000 – రూ. 75,000

☛ 2024: రూ. 90,000 – రూ. 95,000

☛ 2025 (మార్చి 20 నాటికి): రూ.1,05,100 ఉంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2011, 2012 సంవత్సరాల్లో వెండి ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత 2018 వరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. మళ్లీ 2019 నుంచి పెరుగుతూ వస్తూ ప్రస్తుతం లక్ష రూపాయలకుపైనే చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..