Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. మీ డబ్బు 10 సంవత్సరాల్లో రెట్టింపు.. ఇంతకీ ఆ పథకం ఏమిటి?

Post Office Scheme: పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. వివిధ పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి లాభాలు పొందవచ్చు. తక్కువ..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. మీ డబ్బు 10 సంవత్సరాల్లో రెట్టింపు.. ఇంతకీ ఆ పథకం ఏమిటి?
Post Office
Follow us

|

Updated on: Sep 24, 2022 | 5:22 PM

Post Office Scheme: పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. వివిధ పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి లాభాలు పొందవచ్చు. తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించింది. ఇక మీరు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పోస్టాఫీసులోని చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో జమ చేసిన మొత్తానికి ప్రభుత్వ సావరిన్ గ్యారెంటీ ఉన్నందున ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బు బ్యాంకుల కంటే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. ఈ పథకాలలో కిసాన్ వికాస్ పత్ర (KVP) కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకం వడ్డీ రేటు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

వడ్డీ రేటు: 

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకంలో సంవత్సరానికి 6.9 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ చిన్న పొదుపు పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన కలిపి ఉంటుంది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తం 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల నాలుగు నెలలలో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ. 1000, రూ. 100 గుణిజాలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎవరు ఖాతా తెరవొచ్చు?

పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో పెద్దలు ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా, ఈ పథకంలో ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాలను కూడా తెరవవచ్చు. ఈ చిన్న పొదుపు పథకంలో ఒక సంరక్షకుడు మైనర్ లేదా బలహీనమైన మనస్సు ఉన్న వ్యక్తి తరపున కూడా ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తన పేరు మీద కూడా ఖాతాను తెరవవచ్చు. ఏవైనా సందేహాలుంటే పోస్టాఫీసు సిబ్బందిని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.

ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో డిపాజిట్ చేయబడిన మొత్తం కాలానుగుణంగా తగిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్దేశించబడే దాని ప్రకారం డిపాజిట్ తేదీ నుండి మెచ్యూర్ అవుతుంది. ఇలా పోస్టాఫీసుల్లో మెరుగైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం బ్యాంకుల్లో మాత్రమే రకరకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉండగా, కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లో కూడా ప్రవేశపెట్టింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా పథకాలను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి