AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: పీఎం కిసాన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే, ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. చెక్ చేసుకోండి..

వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది.

PM Kisan Yojana: పీఎం కిసాన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే, ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. చెక్ చేసుకోండి..
Pm Kisan
Shaik Madar Saheb
|

Updated on: Aug 28, 2022 | 1:24 PM

Share

PM Kisan Yojana: భారతదేశ జనాభాలో దాదాపు 58% మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ కుటుంబాలన్నింటికీ.. వ్యవసాయమే ప్రాథమిక ఆదాయ వనరు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCI&S) ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 19.92% పెరిగాయి. అయితే.. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు, పెట్టుబడి సాయం అందించేందుకు, పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించింది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి రైతుకు ప్రభుత్వం ఏడాదికి రూ. 6,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. దీనికోసం వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించి.. నిధులను విడుదల చేస్తోంది.

ప్రతి సంవత్సరం డిసెంబరు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మొదటి విడత నగదు, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండవ విడత, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు మూడవ విడత నగదును చెల్లిస్తుంది.

PM కిసాన్ యోజన ప్రయోజనాలు.. ఇతర వివరాలు

ఇవి కూడా చదవండి
  • ఈ పథకం కింద ప్రతి రైతు ప్రభుత్వం ద్వారా ఏటా రూ.6000 పొందేందుకు అర్హులు.
  • పశ్చిమ బెంగాల్ మినహా ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.
  • ఈ పథకంతో రైతులు తమ భూమిని సాగు చేయడానికి విత్తనాలు, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు.

PM కిసాన్ యోజన కింద నమోదు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు

  1. భూమి ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. ఇతర భూముల్లో సాగు చేస్తున్న రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. కుటుంబ ఆదాయం తప్పనిసరిగా 6 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  4. ప్రభుత్వ ఉద్యోగం చేసే కుటుంబంలో ఎవరూ ఉండకూడదు.
  5. రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
  6. రిజిస్ట్రేషన్ చేసుకొని ఈకేవైసీ చేసుకొని ఉంటే.. ఆ రైతులకు బ్యాంకులో నగదు జమ అవుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!