AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 13వ విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు, పెట్టుబడి సాయం అందించేందుకు, పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించి.. రైతులకు చేయూతనిస్తోంది.

PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 13వ విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Pm Kisan Samman Nidhi Yojan
Shaik Madar Saheb
|

Updated on: Dec 15, 2022 | 10:07 AM

Share

PM Kisan Yojana: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు, పెట్టుబడి సాయం అందించేందుకు, పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించింది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించి.. రైతులకు చేయూతనిస్తోంది. ఈ పథకం కింద భూమి ఉన్న ప్రతీ రైతుకు ప్రభుత్వం ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తోంది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. దీనికోసం వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించి.. నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన 12వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లబ్ధిదారులైన రైతులు 13వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.

తాజా నివేదికల ప్రకారం.. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నగదు ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి 20 వరకు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర pmkisan.gov.inలో అందుబాటులో ఉంచుతుంది.

పీఎం కిసాన్ యోజన 13వ విడత కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

అర్హులైన రైతులు PM కిసాన్ యోజనను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) ని కూడా సందర్శించవచ్చు. ఇంకా దశల వారీ ప్రక్రియతో సహా వివరాలను తనిఖీ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

PM కిసాన్ యోజన – కావాలసిన పత్రాలు..

రైతుల ఆధీనంలో ఉన్న భూమి వివరాలు (అర్హత కలిగిన లబ్ధిదారు పట్టా) ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు లబ్ధిదారు కుటుంబ వివరాలు..

PM కిసాన్ యోజన కింద నమోదు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు

  1. భూమి ఉన్న రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. ఇతర భూముల్లో సాగు చేస్తున్న రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. కుటుంబ ఆదాయం తప్పనిసరిగా 6 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  4. ప్రభుత్వ ఉద్యోగం చేసే కుటుంబంలో ఎవరూ ఉండకూడదు.
  5. రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
  6. రిజిస్ట్రేషన్ చేసుకొని ఈకేవైసీ చేసుకొని ఉంటే.. ఆ రైతులకు బ్యాంకులో నగదు జమ అవుతాయి.

PM కిసాన్ 13వ విడత లబ్ధిదారుల స్థితిని ఎలా తనిఖీ చేయాలి..

  • www.pmkisan.gov.inలో లాగిన్ అవ్వండి..
  • వెబ్‌సైట్‌కి వెళ్లి, పేజీకి కుడివైపున రైతుల కార్నర్‌కు స్క్రోల్ చేయండి.
  • ఆ సెక్షన్ కింద ‘బెనిఫిషియరీ స్టేటస్’ అని ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీలో డబ్బు పొందే వ్యక్తి పేరు.. వివరాలను పూర్తిచేయండి.
  • ఫోన్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ని కూడా ఉపయోగించవచ్చు.
  • ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తే.. మీ ఫోన్‌కి వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే OTPని నమోదు చేయాలి.
  • మీరు ‘డేటా పొందండి’ బటన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత చెల్లింపు ఎలా జరుగుతుందో మీరు చూడవచ్చు.
  • చెల్లింపు లబ్ధిదారుడి ఖాతాకు పంపబడిందా లేదా అనేది తెలుస్తుంది.
  • అయితే, నగదు విడుదల చేసినా, చేయకున్నా 13వ విడత స్టేటస్ తెరపై కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..