Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension Scheme: సుప్రీం కోర్టు తీర్పుతో పెన్షనర్లకు ఉపశమనం.. ఆ ఉద్యోగులకు అదనపు అవకాశం

ఈ ఎంపికను ఎంచుకోవడానికి యజమానితో పాటు ఉద్యోగులు ఈపీఎఫ్‌వోకి డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందని తెలిపింది.పింఛను పథకంలో చేరడానికి ఎంపికను వినియోగించుకోని..

Pension Scheme: సుప్రీం కోర్టు తీర్పుతో పెన్షనర్లకు ఉపశమనం.. ఆ ఉద్యోగులకు అదనపు అవకాశం
Pension Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Dec 05, 2022 | 3:56 PM

ఈ ఎంపికను ఎంచుకోవడానికి యజమానితో పాటు ఉద్యోగులు ఈపీఎఫ్‌వోకి డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందని తెలిపింది.పింఛను పథకంలో చేరడానికి ఎంపికను వినియోగించుకోని ఉద్యోగులు ఆరు నెలల్లోగా చేరవలసి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. కేరళ, రాజస్థాన్, ఢిల్లీ హైకోర్టులు వెలువరించిన తీర్పుల్లో ఈ అంశంపై స్పష్టత లేకపోవడంతో చివరి తేదీ వరకు పథకంలో చేరలేని అర్హులైన ఉద్యోగులకు అదనపు అవకాశం కల్పించాలని ధర్మాసనం పేర్కొంది.

కోర్టు నిర్ణయం తర్వాత, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఫ్లాగ్‌షిప్ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ సభ్యులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆప్షన్‌ని పొందడానికి వారికి 4కి బదులుగా 6 నెలల సమయం ఉంది. సభ్యులు నవంబర్ 2022 నుండి ఏప్రిల్ 2023 వరకు ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ గడువులోగా ఉద్యోగులు తమ యజమానితో పాటు పెన్షన్ స్కీమ్‌లో అదనపు కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు డిక్లరేషన్ ఇవ్వాలి.

ప్రభుత్వం ఈ సూచన చేసింది:

పింఛను పొందేందుకు ఎక్కువ మొత్తాన్ని విరాళంగా అందించి జీతాల పరిమితిని పెంచే ప్రక్రియలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పథకానికి జీతం పరిమితి నెలకు రూ.15,000. ఇది చివరిసారిగా సవరించబడింది. 2014 సంవత్సరంలో నెలకు రూ.6,500 నుండి పెంచబడింది. ప్రభుత్వం ఇప్పుడు ఈ వేతన పరిమితిని పెంచి, నెలకు రూ.21,000కి చేర్చవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి